News March 14, 2025

జగిత్యాల: హోలీ వేడుకల్లో కలెక్టర్ దంపతులు

image

మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనం చిన్నారులతో జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు అదనపు కలెక్టర్ బి.ఎస్‌లత తో కలిసి శుక్రవారం హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు కలెక్టర్ దంపతులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ పిల్లలకి మిఠాయిలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి డా. నరేశ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి హరీశ్ పాల్గొన్నారు.

Similar News

News January 2, 2026

ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

image

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్‌, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్‌ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.

News January 2, 2026

పిల్లలను పెంచలేక.. ఎవరూ ఆదరించక!

image

ముగ్గురు పిల్లలకు తండ్రి సురేంద్ర విషం ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. భార్య మరణంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడగా, పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ఎవరూ సాయం చేసేవారు కారట. కూలికి వెళ్తేగాని పూట గడవకపోవడం, పిల్లలను చూసుకోవడం భారంగా భావించే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. <<18730785>>తుడుమలదిన్నెలో<<>> జరిగిన అంత్యక్రియలకు సురేంద్ర బంధువులు, భార్య తల్లిదండ్రులు రాకపోవడం విచారకరం.

News January 2, 2026

కొండగట్టుకు పవన్ కళ్యాణ్ రాక.. అభివృద్ధికి బాట!

image

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకతో కొండగట్టు ఆలయ అభివృద్ధికి బాటలు పడనున్నాయి. ఆంజనేయ స్వామి వెలసిన కొండపై నిద్రిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవనే నమ్మకంతో వచ్చే భక్తులకు, కొండపైకి చేరుకోగానే సరైన గదులు లేక ఆలయ పరిసరాల్లో నేలపై నిద్రిస్తూ అవస్థలు పడ్డారు. భక్తుల మొర ఆలకించిన పవన్ 96 గదుల సత్ర నిర్మాణానికి శనివారం భూమి పూజ చేయనున్నారు. దీంతో భక్తుల కష్టాలు తీరనున్నాయి.