News November 24, 2024

జగిత్యాల: 120 మంది శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం

image

జగిత్యాల జిల్లాలోని వాట్సాప్ గ్రూప్ ద్వారా కలుసుకున్న 120 మంది శ్రీనివాసులు స్థానిక నారాయణ దాసు ఆశ్రమంలో ASI రాజేశుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో 120 మంది శ్రీనివాసులు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు పరిచయ కార్యాచరణ నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2025లో మొదటివారం శ్రీనివాసులంతా కలిసి నిర్వహించే మహా సభను విజయవంతం చేయాలని కోరారు.

Similar News

News November 12, 2025

కరీంనగర్ జిల్లా విద్యాధికారిగా అశ్విని తానాజీ వాంఖడే

image

కరీంనగర్ జిల్లా నూతన విద్యాధికారిగా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) అశ్విని తానాజీ వాంఖడేకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకే ఉన్న జిల్లా విద్యాధికారి చైతన్య జైనిని ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆమె విద్యాధికారిగా కొనసాగనున్నారు.

News November 12, 2025

కరీంనగర్: ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ కమీషనర్ HYD ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2025- 26 సంవత్సరానికి చెందిన 9వ,10వ తరగతి విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి తెలిపారు. www.tgepass.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రూ.4 వేలు మంజూరు అవుతాయన్నారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 12, 2025

జాతీయస్థాయి కళా ఉత్సవ్ పోటీలకు ఎంపికైన విద్యార్థులకు అభినందన

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఈనెల 6, 7వ తేదీలలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో జరిగిన రాష్టస్థాయి కళా ఉత్సవ్ పోటీలలో 9వ తరగతికి చెందిన యన్.ప్రమధశ్రీ యస్.శ్రీసాన్విక, కే.శ్రీవికాస్, కే.వైష్ణవి జాతీయ స్థాయి కళా ఉత్సవ్(జాతీయస్థాయి) పోటీలకు ఎంపికైన పారమిత విద్యార్థులను ఈరోజు కలెక్టర్ పమేలా సత్పత్తి కలెక్టర్ కార్యాలయంలో అభినందించారు.