News March 19, 2025

జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్‌కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News November 27, 2025

కోరుట్ల: నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

image

జగిత్యాల జిల్లాలో సర్పంచ్ నామినేషన్ల సందర్భంగా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా SP అశోక్ కుమార్ తెలిపారు. కోరుట్ల పరిధిలోని ఐలాపూర్, పైడిమడుగు కేంద్రాలను డీఎస్పీతో కలిసి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు అనుమతి పొందిన వాహనాలు, లౌడ్‌స్పీకర్లే వినియోగించాలని సూచించారు. డీఎస్పీ రాములు, సీఐ సురేష్, ఎస్ఐలు పాల్గొన్నారు.

News November 27, 2025

ఏలూరు: సీఎం పర్యటనపై టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్

image

డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈమేరకు కలెక్టర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 1వ తేదీన ఉంగుటూరు మండలంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొంటారన్నారు. అందుకు సంబంధించి ఆయా ప్రదేశాలలో పూర్తిస్థాయి ఏర్పాట్లు చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

News November 27, 2025

GHMCలో విలీనం.. 2 రోజుల్లో GO?

image

జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను విలీనం చేస్తామని సర్కారు ప్రకటించడంతో సర్వత్రా ఇదే చర్చనీయాంశమైంది. విలీనానికి సంబంధించి ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు (GO) 2 రోజుల్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా విలీన ప్రక్రియ ముగించాలని సీఎం ఆదేశించారు.