News March 19, 2025
జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News November 17, 2025
నిమోనియాపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో నిమోనియా నిర్వహణపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిమోనియా లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సీహెచ్ఓలు ముందస్తు డోసు ఇవ్వాలని అన్నారు.
News November 17, 2025
నిమోనియాపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

చిన్నారులు నిమోనియా బారిన పడకుండా తల్లులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. సోమవారం భీమవరం కలెక్టరేట్లో నిమోనియా నిర్వహణపై గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాలో నిమోనియా నిర్వహణ అవగాహన ప్రచారాన్ని ఫిబ్రవరి 28, 2026 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. నిమోనియా లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో సీహెచ్ఓలు ముందస్తు డోసు ఇవ్వాలని అన్నారు.
News November 17, 2025
చలి పెరిగింది గురూ.. జాగ్రత్తగా ప్రయాణించు.!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2 రోజులుగా చలి తీవ్రత పెరుగుతోంది. సాయత్రం నుంచే చలిగాలు పెరగడంతోపాటు, ఉదయానికి చలి తీవ్రత మరింతగా పెరుగుతోంది. నేడు గుంటూరు జిల్లాలో కనీస ఉష్ణోగ్రత 17°సె.గా రికార్డ్ కావడంతో ప్రజలు చలి దుస్తులు ఉపయోగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజామున రహదారులు మంచుతో కప్పబడి ఉండటంతో ప్రయాణాలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. తెల్లవారిన తర్వాతే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.


