News March 19, 2025

జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్‌కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News September 18, 2025

SRPT: ‘సీఎంఆర్ లక్ష్యం గడువులోగా పూర్తి చేయాలి’

image

సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో మిల్లర్లు, అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సీఎంఆర్ గడువును NOV 12 వరకు పొడిగించిందని, మిల్లర్లు అందరూ సహకరించి గడువులోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆయన కోరారు. మిల్లులను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ సీఎంఆర్ పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు.

News September 18, 2025

ఆసియా కప్‌: UAE టార్గెట్ 147 రన్స్

image

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 146/9 స్కోర్ చేసింది. ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీతో రాణించగా చివర్లో షహీన్ ఆఫ్రిది (29*) బౌండరీలతో స్కోర్ బోర్డును పెంచారు. UAE బౌలర్లలో జునైద్ 4, సిమ్రాన్‌జీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే యూఏఈ 20 ఓవర్లలో 147 రన్స్ చేయాలి. UAE గెలుస్తుందని అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.

News September 18, 2025

ఇల్లంతకుంట: ఉపాధ్యాయుడిలా మారిన కలెక్టర్

image

సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఉపాధ్యాయుడిలా మారారు. ఇల్లంతకుంట మండలం రహీంఖాన్పేట మోడల్ స్కూలును బుధవారం ఆయన తనిఖీ చేశారు. కాసేపు ఉపాధ్యాయుడిలా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. అన్ని సబ్జెక్టుల పాఠ్యాంశాలను విద్యార్థులతో నిత్యం చదివించి రాయించాలన్నారు. విద్యాలయం ఆవరణ నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. పాఠ్యాంశాలపై పట్టు వచ్చేలా పిల్లలకు బోధించాలన్నారు.