News March 19, 2025

జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్‌కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News October 24, 2025

హుజూరాబాద్: బాలిక డెడ్‌బాడీతో MLA కౌశిక్ రెడ్డి నిరసన

image

హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన <<18088701>>బాలిక వనం శ్రీవర్ష<<>> భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఈరోజు ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కేంద్రం వద్ద సందర్శించి, అనంతరం బాలిక మృతదేహంతో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. బాలిక కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

News October 24, 2025

సిద్దిపేట: తాగి లారీ నడిపిన డ్రైవర్.. పట్టుకున్న పోలీసులు

image

సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగీలా దాబా చౌరస్తా వద్ద మద్యం తాగి లారీ నడుపుతున్నాడని 100 కాల్‌కు ఫోన్ రావడంతో అప్రమత్తమైన సిద్దిపేట పోలీసులు పరారవుతున్న లారీ డ్రైవర్‌ను పరిగెత్తి పట్టుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు సైతం లారీ డ్రైవర్ నిరాకరించాడు. అతి కష్టం మీద డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేయడంతో 500 కెపాసిటీ గల మిషన్ టెస్ట్‌కి 471 శాతం పర్సంటేజ్ రావడంతో పోలీసులు అవాక్కయ్యారు.

News October 24, 2025

STEM-60 శిక్షణ శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్

image

హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్ STEM-60 శిక్షణ శిబిరాన్ని శుక్రవారం సందర్శించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఐటీడీఏ ఏటూరునాగారం ఆధ్వర్యంలో ఇంటర్ MPC, BiPC విద్యార్థులకు IIT, MBBS కోసం JEE, NEET పరీక్షలకు సన్నద్ధం చేయడంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో DTDO, RCO, DS, ప్రిన్సిపల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.