News March 19, 2025

జగిత్యాల: 22న పీడీఎస్ బియ్యం బహిరంగ వేలం

image

జగిత్యాల జిల్లాలో అక్రమంగా తరలిస్తుండగా వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న పీడీఎస్ బియ్యానికి ఈనెల 22న బహిరంగవేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఆసక్తి గలవారు రూ.3000 టెండర్ ఫీజు, రూ.2 లక్షల ధరావత్ పౌర సరఫరాల అధికారి జగిత్యాల పేరు మీద డీడీ తీసి ఆధార్, పాన్‌కార్డు ప్రతులను DDతో సహా సమర్పించాలన్నారు. పూర్తివివరాలకు జిల్లా పౌరసరఫరాల కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

Similar News

News March 20, 2025

సంతోషాన్ని పంచుకోండి మామా!

image

సంతోషాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒకానొకప్పుడు సంతోషం అంటే మనుషుల మాటల్లో, వారు పంచే ఆప్యాయతలో ఉండేది. ఇప్పుడు వస్తువుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. పక్కనున్న వ్యక్తి సంతోషాన్ని చూసి కొందరు కుళ్లుకుంటున్నారు. ఉన్నది ఒకటే జిందగీ.. ఇకనైనా ఇలాంటివి మాని సంతోషాన్ని ఇతరులతో పంచుకుందాం. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం చేసి ఎదుటివారి సంతోషానికి కారణం అవుదాం. ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ డే.

News March 20, 2025

కష్ణా: ‘డాక్టర్ శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలి’

image

కృష్ణాజిల్లా అవనిగడ్డలో డా. కే శ్రీహరి హత్య కేసు దోషులను పట్టుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంలో 2020వ సంవత్సరంలో వివేకానంద రెడ్డి హత్య తరహాలోనే డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధంగా సీబీసీఐడి విచారణ చేపట్టి డాక్టర్ కోట శ్రీహరి హంతకులను పట్టుకోవాలని కోరారు.

News March 20, 2025

VJA: సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి: కలెక్టర్

image

విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో గురువారం దాతలు ఏర్పాటు చేసిన ఉచిత తాగునీటి ఆర్వో ప్లాంట్‌, వైద్య శిబిరాలను ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డా. జి. లక్ష్మీశ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజల దాహర్తి తీర్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. సేవా కార్యక్రమాలకు దాతలు ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

error: Content is protected !!