News March 29, 2025

జగిత్యాల.. ACCIDENT.. వ్యక్తి మృతి

image

JGTL-KNR ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 11గంటలకు కొండగట్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మధుర నరేశ్ వాహనం అదుపుతప్పి పడగా.. అతన్ని కాపాడేందుకు వచ్చిన మల్యాల(M) గొర్రెగుండానికి చెందిన వంశీధర్ రావును అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీధర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్ఐ తెలిపారు.

Similar News

News July 11, 2025

తిమ్మాపూర్: ‘కుమారుడి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’

image

బెజ్జంకికి చెందిన కోటారి భానుప్రసాద్(19), నరేష్‌తో కలిసి బైక్‌పై కరీంనగర్‌ వెళ్లి తిరుగు ప్రయాణంలో గురువారం తెల్లవారుజామున <<17014948>>రేణికుంటలో<<>> రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సాయిబాబా గుడి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. ప్రమాద ఘటనపై భాను ప్రసాద్ తల్లి రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఢీకొట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

News July 11, 2025

KNR: విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది: USFI

image

KNR జిల్లాలో అనుమతి లేకుండా నడుస్తున్న జూనియర్ కళాశాలలను తక్షణమే మూసివేయాలని USFI (యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) డిమాండ్ చేసింది. ఈ మేరకు USFI కరీంనగర్ జిల్లా కార్యదర్శి సంద గణేష్ ఆధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు DIEOకి గురువారం వినతిపత్రాన్ని సమర్పించారు. అక్రమంగా నడుస్తున్న ఈ కళాశాలల వల్ల విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని, వీటిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు.

News July 11, 2025

కరీంనగర్: ‘రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయండి’

image

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతుల పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఎస్. అనిల్ మాట్లాడుతూ.. తరగతుల్లో విద్యార్థి సమస్యలు, జాతీయవాదం, దేశభక్తి తదితర అంశాలపై చర్చ జరుగుతుందని తెలిపారు. ప్రారంభ ఉపన్యాసాన్ని గుమ్మడి నరసయ్య ఇవ్వనున్నారు.