News March 29, 2025

జగిత్యాల.. ACCIDENT.. వ్యక్తి మృతి

image

JGTL-KNR ప్రధాన రహదారిపై శుక్రవారం రాత్రి 11గంటలకు కొండగట్టు వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మధుర నరేశ్ వాహనం అదుపుతప్పి పడగా.. అతన్ని కాపాడేందుకు వచ్చిన మల్యాల(M) గొర్రెగుండానికి చెందిన వంశీధర్ రావును అతివేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వంశీధర్ తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. మరో ఇద్దరు గాయపడగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని మల్యాల ఎస్ఐ తెలిపారు.

Similar News

News October 21, 2025

వ్యాపారులు డస్ట్ బిన్‌లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

image

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్‌స్పెక్టర్‌‌ను ఆదేశించారు.

News October 21, 2025

తాత్కాలిక కార్మికులకు కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశం

image

నల్గొండ జిల్లాలోని తాత్కాలిక (గిగ్) కార్మికులందరికీ జీవిత బీమా సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. అమెజాన్, జొమాటో వంటి సంస్థల్లో పనిచేసే రోజువారీ కూలీలు కేవలం రూ. 20 వార్షిక ప్రీమియంతో రూ. 2 లక్షల ప్రమాద బీమా పొందవచ్చని తెలిపారు. ఈ నెలాఖరులోగా కనీసం 4 వేల మందికి బీమా చేయించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అవగాహన శిబిరాలు నిర్వహించాలని సూచించారు.

News October 21, 2025

REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో 1,374 మంది నోటాకు ఓటేశారు!

image

2023 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీ చేసిన 19 మందిని 1,374 మంది ఓటర్లు తిరస్కరించారు. అంటే వీరంతా NOTA (None of The Above)కు ఓటు వేశారన్న మాట. ఇదిలా ఉండగా వెయ్యి ఓట్లలోపు ఇద్దరు అభ్యర్థులు సాధించగా 500లోపు ఇద్దరు, 200లోపు ఆరుగురు, ఐదుగురు 100లోపు ఓట్లు సాధించారు. ఆనందరావు అనే ఇండిపెండెంట్ అభ్యర్థి 53 ఓట్లతో చివరి స్థానంలో నిలిచారు.