News May 11, 2024
జగిత్యాల: BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ పై కేసు

నిజామాబాద్ పార్లమెంట్ BJP అభ్యర్థి ధర్మపురి అర్వింద్పై కేసు నమోదు చేసినట్లు సీఐ వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 8న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి హిందువులకు ప్రమాదకరంగా మారాడన్నారు. జగిత్యాల ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని అర్వింద్ మతవిద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు. దీంతో ఎలక్షన్ ఇన్ఛార్జ్ విజయేందర్ ఫిర్యాదుతో కేసు చేశామన్నారు.
Similar News
News January 8, 2026
పర్లపల్లి: ‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి’

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తిమ్మాపూర్ మండలం పర్లపల్లిలోని ప్రభుత్వ ప్రీప్రైమరీ పాఠశాలను గురువారం ఆమె సందర్శించి, ఉచిత యూనిఫాంలు, పుస్తకాలు, స్టేషనరీని అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ప్రత్యేక సిలబస్తో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ప్రస్తుతం జిల్లాలో 33 ప్రీప్రైమరీ పాఠశాలలు పనిచేస్తున్నాయని తెలిపారు.
News January 8, 2026
KNR: బ్యాంకుల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

బ్యాంకులు, ఏటీఎంల వద్ద భద్రతను పటిష్టం చేయాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం ఆదేశించారు. బ్యాంక్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఆర్బీఐ నిబంధనల ప్రకారం హై-క్వాలిటీ సీసీ కెమెరాలు, పానిక్ బటన్లు, బర్గ్లర్ అలారమ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. నగదు తరలింపుపై పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలని, సైబర్ మోసాలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు.
News January 8, 2026
KNR: ‘విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలి’

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ సమీపంలోని ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ పమేలా సత్పతి గురువారం సందర్శించారు. తరగతి గదులు, వసతి గృహం, భోజనశాలను పరిశీలించిన ఆమె.. విద్యార్థులకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా సంగీతం, కుట్టు శిక్షణ, కంప్యూటర్ కోర్సుల ద్వారా విద్యార్థులు స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించాలని సూచించారు.


