News April 13, 2025

జగిత్యాల: BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

image

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. KRTL ఎమ్మెల్యే, ధర్మపురి మాజీ ఎమ్మెల్యే, JGTL నియోజకవర్గ నాయకులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ సభ బీఆర్‌ఎస్‌కు కీలకం కానుంది.

Similar News

News April 10, 2026

రేపు నిజామాబాద్ జిల్లాకు RSS చీఫ్ మోహన్ భాగవత్

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ శనివారం NZB జిల్లాలో పర్యటించనున్నారు. RSS వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలిరాం పంత్ హెడ్గేవార్ పూర్వీకుల స్వగ్రామమైన జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తిలో నిర్మించిన కేశవ స్ఫూర్తి మందిరాన్ని మోహన్ భాగవత్ ప్రారంభించనున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో కేంద్ర బలగాలు కంద కుర్తితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

News April 10, 2026

HDFC వినియోగదారులకు అలర్ట్!

image

సిస్టమ్ అప్‌గ్రేడ్ వల్ల రేపు 2.30AM నుంచి 6.30AMవరకు బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోనున్నట్లు HDFC ప్రకటించింది. అయితే ఉదయం 5 తర్వాత UPI లావాదేవీలు యథావిధిగా చేసుకోవచ్చని పేర్కొంది. డెబిట్ కార్డుల ద్వారా రూ.5వేల వరకూ నగదు విత్‌డ్రాలు, ఆన్‌లైన్ చెల్లింపులు చేసుకోవచ్చని తెలిపింది. Zapp వాలెట్ సేవలు మాత్రం నిరంతరాయంగా కొనసాగుతాయని తెలియజేస్తూ వినియోగదారులను అలర్ట్ చేసింది.

News April 10, 2026

వరల్డ్ టాప్‌-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

image

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.