News April 13, 2025
జగిత్యాల: HATSOFF కలెక్టర్ సాబ్

కొండగట్టు చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా 2 రోజులుగా కలెక్టర్ సత్యప్రసాద్ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ ఆవరణలో తిరుగుతూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భద్రత ఏర్పాట్లు, ట్రాఫిక్, అత్యవసర సేవలు, శానిటైజేషన్ తదితర వాటిని సమీక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు. సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకుంటున్నారు.
Similar News
News September 17, 2025
తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం

సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం కలిశారు. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయనకు టీటీడీ ఛైర్మన్ వివరించారు.
News September 17, 2025
GST ద్వారా రూ.22లక్షల కోట్ల ఆదాయం: నిర్మల

AP: 2017కు ముందు 17రకాల పన్నులు, వాటిపై 8సెస్సులు ఉండేవని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘అన్నింటినీ కలిపి ఒకే పన్ను, 4 శ్లాబులుగా తీసుకొచ్చిందే GST. 2017కు ముందు సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేది. అప్పుడు 65లక్షల మంది పన్ను చెల్లించేవారు ఉండగా, ప్రస్తుతం 1.51కోట్లకు చేరారు. 2018లో GST ద్వారా రూ.7.19లక్షల కోట్ల ఆదాయం వస్తే, 2025 నాటికి రూ.22.087లక్షల కోట్లకు చేరింది’ అని తెలిపారు.
News September 17, 2025
నల్గొండ: భూస్వామ్య కుటుంబంలో పుట్టి వారినే ఎదిరించాడు

నిజాం అనుచరులను ఎదిరించడంలో వేములపల్లి (M) రావులపెంట దళం ప్రధాన పాత్ర పోషించింది. అక్రమ వసూళ్లు, హత్యలు,అత్యాచారాలతో విసిగిన ప్రజలు తిరగబడ్డారు. రావులపెంట భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సీతారాంరెడ్డి ఈ పోరాటానికి నాయకత్వం వహించారు. నిజాంను ఎదిరించేందుకు క్యాంపులు ఏర్పాటు చేసి దాడులు చేశారు. గ్రామంలోని కోటబురుజును కేంద్రంగా చేసుకొని పాములపాడు, ఆమనగల్లులో దళాలను ఏర్పాటు చేసి రజాకార్లను తరిమికొట్టారు.