News February 3, 2025
జగిత్యాల: MLC కవితతో బీసీ, జాగృతి నేతల భేటీ

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నివేదికను వెల్లడించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితతో బీసీ సంఘాలు, తెలంగాణ జాగృతి నేతలు భేటీ అయ్యారు. కవితను ఆమె నివాసంలో కలసిన నేతలు పలు అంశాలపై చర్చించారు. సర్వే గణాంకాల ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎంత మేర రిజర్వేషన్లు పెరుగుతాయన్న అంశంపై కవిత వారితో చర్చించారు.
Similar News
News October 17, 2025
త్వరలో 10 గ్రాముల బంగారం ధర రూ.2లక్షలు: నిపుణులు

రోజురోజుకూ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇదిలాగే కొనసాగితే 2030 నాటికి పది గ్రాముల బంగారం ధర రూ.2 లక్షలకు చేరుతుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇవాళ కూడా 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.3,330 పెరిగి ₹1,32,770కు చేరిన విషయం తెలిసిందే. అమెరికా కరెన్సీ అప్పులు పెరగడం, గ్లోబల్ అస్థిరత కారణంగా ధరలు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. 2027లోనే ఇది సాధ్యం కావొచ్చని మరికొందరంటున్నారు. మీరేమంటారు?
News October 17, 2025
రైల్వేలో 8,850 పోస్టులు.. 4 రోజుల్లో దరఖాస్తులు

రైల్వేలో మరో భారీ నియామకానికి రంగం సిద్ధమైంది. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో గ్రాడ్యుయేట్ స్థాయిలో 5,800, అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో 3,050 పోస్టులున్నాయి.(పోస్టుల సంఖ్యలో మార్పులు ఉండొచ్చు). ఇంటర్, డిగ్రీ పాసైనవారు అర్హులు. గ్రాడ్యుయేట్ పోస్టులకు ఈనెల 21 నుంచి NOV 20వరకు, UG పోస్టులకు ఈనెల 28 నుంచి NOV 27వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్సైట్: https://indianrailways.gov.in/
News October 17, 2025
సిరిసిల్ల: ‘రిజర్వేషన్లపై బీజేపీ నాటకమాడుతోంది’

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ నాటకమాడుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అన్నారు. సిరిసిల్లలోని సీపీఎం కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ బీసీ బిల్లుకు మద్దతు ఇస్తూ కేంద్రంలో అడ్డుకుంటుందని మండిపడ్డారు. బీసీ సంఘాలు అన్ని బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తేనే CPM మద్దతుగా పాల్గొంటుందన్నారు. లేనిచో స్వతంత్రంగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతుందన్నారు.