News February 28, 2025

జగ్గయ్యపేట: చెరువు బజార్లో దారుణ హత్య

image

జగ్గయ్యపేటలో గురువారం రాత్రి అమావాస్య సందర్భంగా దేవతామూర్తుల ఊరేగింపులో వివాదం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల మేరకు.. పాత కక్షల నేపథ్యంలో శ్రీను (27) అనే వ్యక్తిని ప్రత్యర్థులు పీక కోసి హత్య చేశారన్నారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. 

Similar News

News July 9, 2025

VJA: దుర్గమ్మ సన్నిధిలో కొనసాగుతున్న శాకంబరీ ఉత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ సన్నిధిలో శాకంబరీ ఉత్సవాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వీఐపీ ప్రోటోకాల్ అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను ఈవో శీనా నాయక్ పర్యవేక్షిస్తున్నారు. నేడు ఎంతో వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు జరుగుతున్నాయని, గంట గంటకు ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరుగుతోందని అధికారులు తెలిపారు.

News July 9, 2025

భువనగిరి: వరకట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

image

వరకట్న వేధింపులతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన భువనగిరిలో జరిగింది. మోత్కూర్‌కు చెందిన నీరటి కవితకు గుండాల మండలం షాపూర్‌కు చెందిన బాబుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. భువనగిరిలో నివాసముంటున్న కవితను భర్త తరచూ వేధించేవాడిగా తెలుస్తోంది. మానసికంగా హింసించడంతో ఆమె ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వరకట్న వేధింపులే కారణమని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 9, 2025

MIM నేతల పట్ల మెతక వైఖరి లేదు: హైడ్రా

image

TG: తాము ఎంఐఎం నేతల పట్ల ఎలాంటి మెతక వైఖరిని అవలంబించట్లేదని హైడ్రా స్పష్టం చేసింది. హైడ్రా మొదటి కూల్చివేత ఎంఐఎం నేతలకు సంబంధించిన ఆక్రమణలేనని పేర్కొంది. ఇటీవల కూల్చివేతల్లోనూ HYD చాంద్రాయణగుట్టలోని MIM కార్పోరేటర్లకు చెందిన దుకాణాలను తొలగించి భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. తాము పారదర్శకంగా పనిచేస్తున్నామని తెలిపింది. సామాజిక కారణాలతో <<16969545>>ఫాతిమా కాలేజీ<<>> కూల్చివేతను నిలిపివేశామంది.