News April 2, 2025
జగ్గయ్యపేట: బాలికపై అత్యాచారం.. పట్టుకున్న స్థానికులు

జగ్గయ్యపేట మండలం బోదవాడ తండాలో బాలికపై ఓ దుండగుడు మంగళవారం అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఘటనకు పాల్పడిన వ్యక్తిని స్థానిక ఎస్సీ కాలనీ వాసులు పట్టుకుని చెట్టుకు కట్టేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 14, 2025
సిద్దిపేట: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు

మైనర్ను ప్రేమ పేరుతో వేధించిన యువకుడిని సిద్దిపేట టూ టౌన్ పోలీసులు ఆరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ ఉపేందర్ తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట డబుల్ బెడ్రూంలో నివాసం ఉంటున్న సమీర్ (22) ఈ నెల 10న రాత్రి బాలిక ఇంటికి వెళ్లాడు. ఆమె తల్లిదండ్రులతో తాను వారి అమ్మాయిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని వేధించాడు. వారి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదైంది.
News November 14, 2025
Jubilee hills bypoll: రిజల్ట్ ఎక్కడున్నా తెలుసుకోవచ్చు!

యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మరికొద్దిసేపట్లో కౌంటింగ్ జరగనుంది. అయితే, రౌండ్ల వారీగా రిజల్ట్ అప్డేట్స్ కోసం అంతా ఎదురుచూస్తున్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు వివరాలు అందించేందుకు ECI చర్యలు తీసుకుంది. స్టేడియంలో LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. EC యాప్ ద్వారా అప్డేట్ ఇస్తామని అధికారులు చెప్పారు. Way2Newsలోనూ ఎప్పటికప్పుడు జూబ్లీహిల్స్ ఫలితాల వివరాలు చూసుకోవచ్చు.
SHARE IT
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: NOTAతో కలిపి 59 మంది.. ECI స్పెషల్ పర్మిషన్

జూబ్లీహిల్స్లో నోటాతో కలిపి 59 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ECI నుంచి ప్రత్యేక అనుమతి తీసుకుని ఈ సారి కౌంటింగ్ కోసం 42 టేబుల్స్ ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియను సాధారణ పరిశీలకులు, ECI బృందం పరిశీలించనుంది. మొత్తం కౌంటింగ్ ప్రక్రియకు 186 మంది సిబ్బందిని నియమించారు. వీరిలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు.


