News February 25, 2025

జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్‌కి చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కి తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 6, 2025

MBNR: ప్రభుత్వ ఉద్యోగులు.. ALERT!

image

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్‌లలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
#SHARE IT.

News December 5, 2025

MBNR: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యండి: కలెక్టర్

image

గ్రామపంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇప్పటివరకు ఫారం-14 (పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు) దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పంపడానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టిందని, మరో అవకాశంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
SHARE IT.

News December 5, 2025

బాలానగర్: ఉద్యోగాన్ని వదిలి.. సర్పంచి బరిలో..!

image

బాలానగర్ మండలంలోని పెద్దాయపల్లికి చెందిన అంగన్వాడీ కార్యకర్త గాయత్రి ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేశారు. పెద్దాయపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వేషన్ కావడంతో పోటీ చేసేందుకు గురువారం స్థానిక దేవాలయంలో పూజలు నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. ఈమె భర్త లక్ష్మయ్య గతంలో పెద్దాయపల్లి ఎంపీటీసీగా పనిచేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నడంతో హాట్ టాపిక్‌గా మారింది.