News February 25, 2025

జడ్చర్లలో అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

image

జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బిహార్‌కి చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కి తీసుకుని ఉంటున్నాడు. కాగా, సోమవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 22, 2025

MBNR: నీటి కోసం మూడేళ్లుగా ఉపాధ్యాయుడి పోరాటం

image

ఉమ్మడి జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వీరు మల్లేష్ “WALK FOR WATER’ అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలోని ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ.. విద్యార్థులకు నీటి యొక్క ప్రాముఖ్యతను, నీటిని సంరక్షించుకునే విధానాన్ని వివరిస్తూ నీటి ప్రతిజ్ఞ చేయిస్తూ.. గత మూడేళ్లుగా నీరు వృధా కాకుండా ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం.

News March 22, 2025

జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

image

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.

News March 22, 2025

MBNR: మోసం చేస్తున్నారు.. జర జాగ్రత్త..!

image

రుణాల పేరిట కేటుగాళ్లు మోసం చేస్తున్నారని, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా గద్వాల, గట్టు తదితర చోట్ల ఓ నకిలీ ఏజెంట్ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశాడు. రుణాలు మంజూరు కావాలంటే రూ.లక్ష నుంచి రూ.4 లక్షల వరకు ముందు ఇస్తే మళ్లీ మీ ఖాతాల్లో జమవుతామని చెప్పి రూ.లక్షల్లో కొట్టేశాడు. SHARE IT

error: Content is protected !!