News February 2, 2025

జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ <<15332056>>రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News October 25, 2025

ఎలాంటి పొరపాట్లు లేకుండా రివిజన్ పూర్తి చేయాలి: సుదర్శన్ రెడ్డి

image

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన 2002, 2025 జాబితాల మ్యాపింగ్‌ను నాలుగు కేటగిరీలుగా విభజించినట్లు తెలిపారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. కేటగిరీ A జాబితా నిర్ధారణతో పాటు C, D మ్యాపింగ్‌ను శనివారానికి పూర్తి చేస్తామని తెలిపారు.

News October 25, 2025

GWL: ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలి- పల్లయ్య

image

ప్రభుత్వం నిరుద్యోగుల కష్టాలను గుర్తించి ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీఆర్ఎస్వీ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య పేర్కొన్నారు. శనివారం గద్వాల లైబ్రరీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వానికి మద్యం టెండర్ల మీద ఉన్న ధ్యాస నిరుద్యోగులపై లేదన్నారు. నోటిఫికేషన్ విడుదల చేయకపోతే త్వరలో కలెక్టరేట్ల ముట్టడి చేపడతామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు.

News October 25, 2025

NRPT: SIR జాబితా పకడ్బందీగా రూపొందించాలి

image

ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా పకడ్బందీగా రూపొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శనివారం హైద్రాబాద్ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు. 2002 లో చేసిన స్పెషల్ సమ్మరీ రివిజన్ ఓటర్ జాబితా 2025 ఓటరు జాబితా మ్యాపింగ్ ప్రక్రియను బూత్ స్థాయి అధికారుల సహకారంతో వేగంగా పూర్తి చేయాలని అన్నారు.