News February 2, 2025

జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

image

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్‌లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News November 22, 2025

రాములపల్లి గ్రామ శివారులో మహిళ మృతదేహం కలకలం

image

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాములపల్లి గ్రామంలో శనివారం విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామ శివారులో ఓ మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యం కావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతురాలు గ్రామానికి చెందిన చింతకుంట్ల సుకృతగా గుర్తించారు. ఇది హత్యనా? లేక మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తూ, పోలీసులకు సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 22, 2025

రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా గ్లోబల్ సమ్మిట్: CM

image

TG: ఫ్యూచర్ సిటీలో DEC 8, 9 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. రెండేళ్ల పాలనా విజయాలు ప్రతిబింబించేలా ఈ వేడుక ఉండాలని సూచించారు. 8న ప్రభుత్వ పథకాలు, విజయాలను చాటి చెప్పాలన్నారు. 9న తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఉండాలని చెప్పారు. పరిశ్రమలు, పెట్టుబడులకు ఇచ్చే ప్రాధాన్యంపై ఆడియో, వీడియో ప్రజెంటేషన్లు రెడీ చేయాలన్నారు.

News November 22, 2025

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ధారసింగ్ జాదవ్

image

వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ధారసింగ్ జాదవ్ ఎన్నికయ్యారు. పార్టీ అంతర్గత వ్యవహారాల్లో విశేష అనుభవం కలిగిన ఆయన ప్రస్తుతం టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో పెద్దేముల్ జడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన ధారసింగ్ జాదవ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కార్యవర్గంలో కీలకస్థాయి పదవుల్లో సేవలందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తాజాగా ఆయన్ను DCC వరించింది.