News February 2, 2025
జడ్చర్ల: ఆడుకుంటూ.. క్వారీ గుంతలో పడిపోయారు!

జడ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామ<<15332056>> రిజర్వాయర్లో పడి<<>> మహేశ్(4) మృతి చెందగా.. భాగ్యలక్ష్మి (7) ఆచూకీ కోసం శనివారం పోలీసులు గాలించిన సంగతి తెలిసిందే. గ్రామస్థుల కథనం ప్రకారం.. చిన్నారుల తండ్రి పనిచేస్తుండగా.. తల్లి వ్యవసాయ పొలంలో నీరు పెట్టేందుకు వెళ్లింది. ఈ క్రమంలో చిన్నారులు ఆడుకుంటూ ఆ గుంతలో పడిపోయారు. భాగ్యలక్ష్మి మృతదేహం కోసం గాలింపు చేపడుతున్నారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News February 23, 2026
బంగారం ధరల పెరుగుదలపై నిర్మల ఏమన్నారంటే?

బంగారం ధర లిమిట్ దాటిన మాట నిజమే కానీ ఆందోళనకర స్థాయికి చేరినట్లు తాను అనుకోవట్లేదన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. RBI బోర్డ్ డైరెక్టర్లతో సమావేశం అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. గోల్డ్ సామాన్యుడికి ఫేవరెట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పారు. ఈ ధరలను RBI పర్యవేక్షిస్తోందని దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం, వెండిని కొనడం వల్లే వాటి ధరలు పెరుగుతున్నాయన్నారు.
News February 23, 2026
బాల్య వివాహ రహిత సమాజమే లక్ష్యం: కలెక్టర్

బాల్య వివాహాల నిర్మూలన కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన ‘బాల్య వివాహ ముక్త్ భారత్’ ప్రచార రథాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల బాలికల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా వారి భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. సమాజంలో వేళ్లూనుకున్న ఈ దురాచారాన్ని రూపుమాపేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు
News February 23, 2026
28న వైవీయూ హ్యాండ్ బాల్ జట్టు కోసం సెలక్షన్ ట్రయల్స్

యోగి వేమన యూనివర్శిటీ హ్యండ్ బాల్ స్త్రీ, పురుషుల జట్ల కోసం డైరెక్ట్ సెలక్షన్ ట్రయల్స్ విశ్వవిద్యాలయ వేమన క్రీడా ప్రాంగణంలో ఈ నెల 28 వతేదీ ఉదయం 9 గంటలకు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు సెక్రటరి డా. రామ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వైవీయూ అనుబంధ సంస్థలలో చదువుతూ ఉండాలన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్ల లోపు ఉండాలన్నారు. వివరాలకు 6281689398 నంబరును సంప్రదించాలన్నారు.


