News April 11, 2025
జడ్చర్ల: గెస్ట్ లెక్చరర్ల పోస్టుల కోసం దరఖాస్తులు

జడ్చర్ల మండలం మాచారం తెలంగాణ గిరిజన గురుకుల డిగ్రీ, పీజీ కళాశాలలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కెమిస్ట్రీ- 4, ఫిజిక్స్ 1, హిస్టరీ 1, కామర్స్ 1, తెలుగు 1, ఇంగ్లీష్ లో ఒక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి గలవారు దరఖాస్తులు సమర్పించాలని అధికారులు తెలిపారు.
Similar News
News April 10, 2026
మహబూబ్నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
News April 10, 2026
మహబూబ్నగర్: రోడ్డు భద్రతపై వీడియో పోటీలు

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు “Arrive Alive” పేరుతో వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి తెలిపారు. గరిష్ఠంగా 3 నిమిషాల నిడివి గల వీడియోలను రూపొందించి, ఈ నెల 14లోపు ఎస్పీ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఉత్తమ వీడియోకు రూ.5,000 నగదు బహుమతి అందజేస్తామని, ప్రమాదాల నివారణే ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.
News April 10, 2026
MBNR: పెరుగుతున్న ఎండలు.. ప్రజల బెంబేలు

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత రోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్లో 41.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. భూత్పూర్ మండలం కొత్త మొల్గర 40.7, కౌకుంట్ల 40.6, భూత్పూర్ 40.3, నవాబుపేట 45.2, చిన్న చింతకుంట 40.0, మూసాపేట మండలం జానంపేట 39.7, అడ్డాకుల, మహమ్మదాబాద్, దేవరకద్ర 39.6, మిడ్జిల్ మండలం దోనూరు, మహబూబ్ నగర్ గ్రామీణం 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.


