News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News November 28, 2025
ప్రొద్దుటూరులో 10 మంది విద్యార్థులకు అస్వస్థత

ప్రొద్దుటూరులోని వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం తినడం వల్ల 10 మంది విద్యార్థులు తీవ్ర అస్తస్వతుకు గురయ్యారు. వడ్డించిన పప్పు దుర్వాసన వస్తుందని, బాగాలేదని మొదట తిన్న కొంత మంది విద్యార్థులు చెప్పడంతో ఆ పప్పును వడ్డించకుండా పక్కన పెట్టేశారు. కొద్దిసేపటికి ఆ 10 మందికి కడుపునొప్పి, వాంతులు రావడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఉపాధ్యాయులు ఆటోలో విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News November 28, 2025
కేసీఆర్ వల్ల కాదు సోనియా వల్ల తెలంగాణ వచ్చింది: పీసీసీ చీఫ్

TG: 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకమని, ఆయన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపించారు. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి BRS సిద్ధమైందని మీడియా సమావేశంలో విమర్శించారు.
News November 28, 2025
హెయిర్లాస్కు చెక్ పెట్టే LED హెల్మెట్

వాతావరణ మార్పులు, జీవనశైలి వల్ల హెయిర్లాస్ కామన్ అయిపోయింది. దీనికి ఈ LED రెడ్లైట్ హెల్మెట్ పరిష్కారం చూపుతుంది. ఈ డివైజ్ని ఆన్ చేసి రోజూ 25 నిమిషాలు తలకు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ట్రీట్మెంట్ సెషన్లను ట్రాక్ చేయడానికి రిమోట్లో ఎల్ఈడీ డిస్ప్లే ఉంటుంది. దీంట్లోని సెన్సార్లు ఉష్ణోగ్రత స్థాయిని పెరగనివ్వకుండా చూస్తాయి. ఇవి అన్ని ఆన్లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.


