News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News March 19, 2025
యుద్ధం ముగింపుకు అంగీకరించిన పుతిన్ : వైట్హౌస్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు పుతిన్ అంగీకరించినట్లు వైట్హౌస్ ప్రకటించింది. రష్యా అధ్యక్షుడితో ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపారు. ఈమేరకు యుద్ధానికి స్వస్థి పలకాలని విజ్ఞప్తి చేయగా పుతిన్ అంగీకరించినట్లు శ్వేతసౌధం తెలిపింది. గత కొంతకాలంగా యుద్ధం ముగింపుకు అమెరికా అధ్యక్షుడు ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.
News March 19, 2025
NLG: ఈనెల 22న ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

నల్లగొండ జిల్లాలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వయోవృద్దులు, దివ్యాంగుల కోసం ఈనెల 22న నల్గొండ కలెక్టరేట్లో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. సాయంత్రం 3గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వృద్ధులు, దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News March 19, 2025
TODAY HEADLINES

TG: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
TG: ఇందిరమ్మ ఇళ్లు.. వారికి తొలి ప్రాధాన్యత: సీఎం రేవంత్
AP: చేనేత కార్మికుల ఇంటి నిర్మాణానికి రూ.50,000: CM
AP: 50 ఏళ్లకే పెన్షన్పై మంత్రి కీలక ప్రకటన
☛ కుంభమేళా దేశ ప్రజల విజయం: PM మోదీ
☛ మే 20న దేశవ్యాప్త సమ్మె: కార్మిక సంఘాలు
☛ ISS నుంచి భూమిపైకి సునీతా విలియమ్స్ తిరుగు ప్రయాణం