News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

Similar News

News December 13, 2025

కాకినాడ జిల్లాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>నేషనల్ <<>>హెల్త్ మిషన్ కాకినాడ జిల్లాలో కాంట్రాక్ట్ విధానంలో 35 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ, ఇంటర్, డిప్లొమా, PG, PGDCA, బీఫార్మసీ, డీఫార్మసీ, MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు DEC 15- 20 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.200. దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://eastgodavari.ap.gov.in

News December 13, 2025

మరీ కాకతీయ సంగతేందీ..?

image

ఎందరినో మేధావులుగా చేసిన కాకతీయ యూనివర్సిటీపై ప్రభుత్వం శీతకన్ను వేసింది. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న వర్సిటీ మలిదశ ఉద్యమానికి ఊపిరులూదింది. KU కేంద్రంగా రాజకీయ పార్టీలు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయి. BRS హయాంలో నిధులు రాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉస్మానియాకు రూ.వేయి కోట్లు విడుదల చేయగా, KUకి కూడా రూ.వేయి కోట్లు కేటాయించాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై కామెంట్?

News December 13, 2025

WGL: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు తత్కాల్ అవకాశం

image

ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ 2025-26 విద్యాసంవత్సర ప్రవేశాలకు తత్కాల్ స్కీం కింద మరోసారి అవకాశం కల్పించినట్లు HNK డీఈఓ గిరిరాజ్ గౌడ్, ఉమ్మడి WGL జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సదానందం తెలిపారు. అపరాధ రుసుంతో ఈనెల 15, 16, 17 తేదీల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు.TOSS వెబ్‌సైట్ లేదా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుని, డాక్యుమెంట్లు సంబంధిత అక్రిడిటెడ్ విద్యాసంస్థల్లో సమర్పించాలని సూచించారు.