News March 17, 2025

జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

image

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్‌ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.

Similar News

News November 22, 2025

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ఏపీ మంత్రి

image

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అధికారులు ఆలయ సంప్రదాయాల ప్రకారం అర్చకులు స్వాగతం పలికారు. వేదాశీర్వచనం చేసి స్వామి వారి లడ్డూ ప్రసాదంతోపాటు స్వామి వారి ఫొటో ఆలయ అధికారులు అందజేశారు.

News November 22, 2025

అన్నమయ్య: అసెంబ్లీలో మాట్లాడేది వీళ్లే..!

image

రాష్ట్రస్థాయి మాక్ అసెంబ్లీ కోసం అన్నమయ్య జిల్లా నుంచి ఏడుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. డైట్‌లో ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. వీళ్లు వాళ్ల నియోజకవర్గంలోని సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడతారు.
మదనపల్లె:ఎం.పార్థసారథి
పీలేరు:కె.తేజశ్రీ
తంబళ్లపల్లె:జె.అనిల్ కుమార్
రాయచోటి: ఎం.సుష్మతాజ్
రాజంపేట: కొల్లి వీక్షిత, పట్నం సాయి
రైల్వేకోడూరు: ఎస్.నూర్ ఆయేషా

News November 22, 2025

HYD: అన్నపూర్ణ ఫిల్మ్ అకాడమీని సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి

image

అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినీ నటుడు నాగార్జునతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల సృజనాత్మకతను అభినందించారు. 1970లలో సరైన వసతులు లేనప్పుడు దిగ్గజ అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోను స్థాపించడం, అది హైదరాబాద్‌లో ముఖ్యమైన సాంస్కృతిక ల్యాండ్‌మార్క్‌గా ఎదగడంపై డిప్యూటీ సీఎం ప్రశంసలు కురిపించారు.