News March 17, 2025
జడ్చర్ల: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. జడ్చర్ల సమీపంలోని మాచారం వద్ద ఎదురెదురుగా వస్తున్న మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్సు, ఓ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు తెలియ రాలేదు. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ కావటంతో పోలీసులు అక్కడికి చేరుకుని క్లియర్ చేసి, ఘటనపై విచారణ చేపట్టారు.
Similar News
News October 23, 2025
వలసబాట పట్టిన కూలీలు

గ్రామాల్లో ఉపాధి కరువై పొట్ట కూటి కోసం కూలీలు వలసబాట పట్టారు. బుధవారం పెద్దకడబూరు ఎస్సీ కాలనీకి చెందిన పలువురు కూలీలు కర్ణాటకలోని రాయచూరు జిల్లా గబ్బూరు మండలం హనుమాపురంలో పత్తి తీయడానికి టెంపోలో బయలుదేరారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామంలో సాగు చేసిన పత్తి పంట పూర్తిగా దెబ్బతినడంతో పనులు కరువయ్యాయి. దీంతో చేసేది లేక పిల్లా పాపలతో కూలీలు వలస బాట పట్టారు.
News October 23, 2025
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో

రాబోయే తుఫాన్ నేపథ్యంలో తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ఆర్డీవో సందీప్ బుధవారం సూచించారు. కర్నూలు రూరల్ మండలంలో 11, సి.బెళగల్ మండలంలో 9 గ్రామాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందన్నారు. వరద కారణంగా ఏవైనా ఇబ్బందులు కలిగితే ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ 08518-241380 నంబర్ను సంప్రదించాలని సూచించారు.
News October 23, 2025
మెటాలో 600 ఉద్యోగులపై వేటు!

మెటా కంపెనీ AI సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్ నుంచి 600 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైనట్లు US మీడియా పేర్కొంది. దీంతో ఫేస్బుక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ యూనిట్, ప్రొడక్ట్ ఏఐ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లపై ప్రభావం పడనుంది. కాగా ఈ తొలగింపుతో అనవసర విధులు తగ్గి ఉద్యోగులు శ్రద్ధతో పనిచేస్తారని మెటా చీఫ్ ఏఐ ఆఫీసర్ వాంగ్ తెలిపారు. అయితే కొత్త నియామకాలపై దీని ఎఫెక్ట్ ఉండదని తెలుస్తోంది.