News March 18, 2025

జడ్చర్ల బస్టాండ్‌లో దొంగలు.. జర జాగ్రత్త..!

image

సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న దొంగలను మంగళవారం జడ్చర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. విజిలెన్స్ సెక్యూరిటీ లింగంపేట శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. బస్టాండ్‌లో ప్రయాణికుల నుంచి సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా పట్టుబడ్డ నిందితులు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి నుంచి 6 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News March 19, 2025

మహబూబ్‌నగర్: నందిని మృతి.. ఆర్థిక సాయం 

image

పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మసీ కాలేజీలో బీఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నందిని అనే విద్యార్థిని ఇటీవల కామెర్లు, థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ మృతిచెందింది. దీంతో పీయూ వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ చెన్నప్ప బుధవారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రూ.25 వేలు ఆర్థిక సాయాన్ని అందించారు. వీసీ మాట్లాడుతూ.. నందిని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

News March 19, 2025

MBNR: TG ఖోఖో జట్టులో ఎంపికైన పీడి

image

దేశ రాజధాని దిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టులో మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండల(ZPHS)కు చెందిన పీడీ ఎం. వెంకటమ్మ ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన వెంకటమ్మను జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు అభినందించారు. >CONGRATULATIONS

News March 19, 2025

తెలంగాణ రాష్ట్ర జట్టు కెప్టెన్‌గా పాలమూరు వాసి

image

దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడలకు తెలంగాణ రాష్ట్ర ఖోఖో మహిళల జట్టు కెప్టెన్‌గా మక్తల్ పట్టణానికి చెందిన పీడీ బి.రూప ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరగనున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్రీడల్లో ఆమె పాల్గొంటారు. ఎంపికైన రూపను ఉమ్మడి జిల్లా నేతలు, ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు. CONGRATULATIONS.

error: Content is protected !!