News April 12, 2024
జడ్చర్ల: బాలిక అదృశ్యం… కేసు నమోదు

జడ్చర్ల పోలీస్ స్టేషన్లో బాలిక అదృశ్యంపై కేసు నమోదైంది. ఎస్సై చంద్రమోహన్ వివరాల ప్రకారం.. జడ్చర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) ఇంట్లో చెప్పకుండా ఈనెల 7న వెళ్లిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News March 21, 2025
MBNR: టెన్త్ విద్యార్థులు.. ఫోన్ చేయండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు ఏవైనా సూచనలు, సందేహాలు ఉంటే MBNR-98487 57542,93908 11476, NGKL-94406 48324,98850 17701 టోల్ ఫ్రీ నంబర్లు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్పై బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ సూచిస్తుందని అధికారులు తెలిపారు.
News March 21, 2025
MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
News March 21, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేటి నుంచి టెన్త్ పరీక్షలు

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా పెట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాల్లో 13,038 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారని, 5 నిమిషాలు ఆలస్యమైన పరీక్ష కేంద్రానికి అనుమతిస్తామని, ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని అన్నారు.