News March 30, 2024
జడ్చర్ల: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన జడ్చర్ల మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మిడ్జిల్ మండలం అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మహేశ్( 26) శుక్రవారం 9 గంటలకు అయ్యవారిపల్లి నుంచి జడ్చర్లకు వెళ్తున్నాడు. ఈక్రమంలో గంగాపూర్ శివారు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి, ఆస్పత్రిలో మరణించాడని గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News January 16, 2025
నాగర్ కర్నూల్: అదనపు కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
నాగర్ కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని అదనపు కలెక్టర్గా పి.అమరేందర్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కలెక్టర్ బాదావత్ సంతోష్ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నల్గొండ జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేసి, జిల్లాకు అదనపు కలెక్టర్గా బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
News January 16, 2025
శ్రీశైలం: స్వామి అమ్మవార్లకు రావణ వాహన సేవలు
శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి శ్రీశైల క్షేత్రంలో గురువారం బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో సందర్భంగా స్వామి, అమ్మవార్లకు రావణ వాహన సేవలు ఘనంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, పూజారులు, భక్తులు, స్థానికులు, తదితరులు పెద్ద ఎత్తున స్వామివారి బ్రహ్మోత్సవ సేవలో పాల్గొన్నారు.
News January 16, 2025
UPDATE: కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం.. మృతుల వివరాలు
కల్వకుర్తి మండలంలోని తర్నికల్ గ్రామం వద్ద తిరుపతి హైవేపై బుధవారం సాయంత్రం <<15163728>>ఘోర రోడ్డు<<>> ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల వివరాలు.. కల్వకుర్తి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బంగారయ్య (36), మహేశ్ (35) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు.