News September 23, 2024

జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవో వెంకట్రామన్ బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో కీలక ఉద్యోగుల బదిలీలపై ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జడ్పీ ఇన్‌ఛార్జ్ సీఈవోగా పనిచేస్తున్న రావాడ వెంకట రామన్‌ను విజయనగరం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఎల్.ఎన్.వి శ్రీధర్ రాజాను శ్రీకాకుళం జిల్లా పరిషత్ నూతన సీఈవోగా నియమించారు.

Similar News

News December 4, 2025

ఎచ్చెర్ల: రిజల్ట్స్ వచ్చాయి

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 2, 4, 6, 8, 10వ సెమిస్టర్ల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈమేరకు యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రిజల్ట్స్‌ను అధికారిక వెబ్ సైట్‌ https://brau.edu.in/లో పొందుపరిచామన్నారు. 95 మందికి 84 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

News December 4, 2025

గర్భస్థ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం: DM&HO

image

గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని DM &HO అనిత స్పష్టం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం లింగ ఆధారిత హింస నివారణ, మెడికో లీగల్ కేర్‌పై శిక్షణ కార్యక్రమం జరిగింది. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింసలను అరికట్టి, లింగ వివక్ష చూపరాదని డీఎంహెచ్వో తెలియజేశారు.

News December 3, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

➤కోటబొమ్మాళిలో జేసీ ఆకస్మిక తనిఖీ
➤పాతపట్నం: లగేజీ ఆటో బోల్తా.. బాలుడికి గాయాలు
➤మనుషుల నుండి Scrub Typhus వ్యాపించదు: DMHO
➤శ్రీకాకుళం: ప్రజా ఉద్యమంపై ఉక్కుపాదం వద్దు
➤రైతుసేవలో కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే బగ్గు
➤మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే శిరీష
➤మందస: నరకాన్ని తలపిస్తున్న రహదారులు