News August 7, 2024

జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

image

ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక అధికారిగా బాధ్యతలను చేపట్టారు. ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ పదవీకాలం ఈ నెల 6తో ముగిసి పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

Similar News

News November 13, 2025

తల్లి కష్టం చూసి.. గ్రూప్-1 ఉద్యోగం సాధించి..

image

ఖమ్మం: చిన్న తనం నుంచే తల్లి కండక్టర్‌గా పడుతున్న కష్టాన్ని చూసి, ఉన్నతస్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో గ్రూప్-1 ఉద్యోగం సాధించిన ధర్మపురి జగదీష్.. ఖమ్మం నూతన ఆర్టీఓగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. తొలుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఆయన, ఆ తర్వాత పెద్ద ఆఫీసర్ కావాలనే లక్ష్యంతో పట్టుదలతో చదివి గ్రూప్-1లో విజయం సాధించారు. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం నుంచి ఎదిగిన ఆయన తీరు నేటి యువతకు స్ఫూర్తిదాయకం.

News November 13, 2025

ఖమ్మం: 208 స్కూళ్లకు 26 మందే..

image

విద్యార్థులు క్రీడల్లో రాణించడంలో పీఈటీల పాత్ర ఎంతో కీలకం. అయితే జిల్లాలో వారి కొరత తీవ్రగా వేధిస్తోంది. జిల్లాలోని 208 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు కేవలం 11 మంది పీడీలు, 15 మంది పీఈటీలు మాత్రమే ఉన్నారు. అంటే మొత్తంగా 26 మందితోనే నెట్టుకొస్తున్నారు. శారీరక వికాసానికి క్రీడలు తప్పనిసరైనా తర్ఫీదు ఇచ్చేవారు లేకపోవడంతో ప్రతిభ ఉన్నా విద్యార్థులు స్వయంగా సిద్ధమవ్వాల్సి వస్తోంది.

News November 13, 2025

ఖమ్మం: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

image

సూర్యాపేట(D) చిలుకూరు (M) కట్టకొమ్ముగూడెంకు చెందిన కృష్ణ, నల్గొండ (D) నకిరేకల్ (M) ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా SRPT, KMM, MLG, NLGతో పాటు HYD, APలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా అతని వద్ద KMM వాసులకు చెందిన 6 బైక్‌లు ఉన్నాయి.