News February 25, 2025
జనగాం: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించిన కలెక్టర్

జనగాం మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళల జీవన ఉపాధికి, ఆర్థిక స్వేచ్ఛకు క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. ఇంతటి విశాలమైన, శుభ్రమైన క్యాంటీన్ ప్రారంభించినందుకు మెప్మా లతాశ్రీ, ఎస్హెచ్జీ గ్రూప్ను కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 22, 2025
పూలు, సుగంధ ద్రవ్యాల సాగుపై దృష్టి సారించాలి: ప్రేమ్ సింగ్

నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి, DPT డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ప్రేమ్ సింగ్ శనివారం జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్, డ్రిప్, పండ్లు, కూరగాయలు, పూల తోటల పెంపకం పథకాల అమలును ఆయన పరిశీలించారు. రైతులకు అధిక ఆదాయం ఇచ్చే పూలు, సుగంధ ద్రవ్యాల సాగును పెంచాలని సూచించారు. రైతులకు డ్రిప్ పరికరాలను సకాలంలో అందించాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు.
News November 22, 2025
వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా కవిత

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన ఐ బొమ్మ రవి కేసులో కీలక పాత్ర పోషించిన డీసీపీ దార కవితను ప్రభుత్వం వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించింది. వరంగల్ NITలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కవిత 2010 గ్రూప్-1లో డీఎస్పీగా చేరారు. ప్రస్తుతం HYD కమిషనరేట్లో డీసీపీగా పనిచేస్తున్నారు. కాగా గతంలో శ్రీనివాస్ అనే అధికారిని నియమించినా, చేరేలోగా ఆర్డర్ క్యాన్సిల్ కావడంతో తాజాగా కవిత నియమితులయ్యారు.
News November 22, 2025
అలాగైతే తులం బంగారం, రూ.2,500 ఇచ్చేవాళ్లం: జూపల్లి

TG: పథకాల అమలుపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘తులం బంగారం, రూ.2,500 ఏమయ్యాయంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్తో పాటు బంగారం ఇవ్వాలంటే మరో రూ.లక్ష అవుతుంది. తులం బంగారం అమలుకు రూ.4వేల కోట్లు, మహిళలకు రూ.2,500 ఇవ్వడానికి రూ.10వేల కోట్లు కావాలి. ఏడాదికి రూ.75వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. BRS అప్పులు చేయకుండా ఉండి ఉంటే పథకాలన్నీ అమలయ్యేవి’ అని అన్నారు.


