News February 25, 2025
జనగాం: వేసవిలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండాలి: కలెక్టర్

రాబోయే వేసవిలో క్షేత్ర స్థాయిలో నిరంతరం విద్యుత్ ఉండాలని, దాని కోసం కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ విద్యుత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వారు జనగాం సూర్యాపేట రోడ్డులో ఉన్న 33/11 సబ్ స్టేషన్ను సందర్శించారు. అనంతరం ఫీడర్ల వారీగా, LV అంతరాయాలను సమీక్షించారు. సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News December 9, 2025
కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర పూజలు

విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు జరుగుతుండగా.. మంగళవారం లక్ష్మీహోమం, పూర్ణాహుతి నిర్వహించారు. డిసెంబర్ 19 వరకు ఆర్జిత సేవలు రద్దు చేశారు. రూ.500 దర్శనం, ప్రసాదం కోసం వాట్సాప్ (9552300009) ద్వారా బుక్ చేసుకోవచ్చు. వృద్ధులు, గర్భిణులకు గురువారం తప్ప మిగతా రోజుల్లో మధ్యాహ్నం 2-3 గంటల వరకు దర్శనం కల్పిస్తున్నారు. వచ్చే గురువారం (డిసెంబర్ 11) రద్దీ దృష్ట్యా పూజా వేళలు కుదించారు.
News December 9, 2025
ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర కీలకం: కలెక్టర్

పంచాయతీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నిర్వహించిన ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మాస్టర్ ట్రైనర్లు ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆర్డీవో పాండు పాల్గొన్నారు.
News December 9, 2025
విశాఖలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సీఎం చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్న నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మధురువాడ ఐటీ హిల్స్పై సందర్శించిన ఆయన కాగ్నిజెంట్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్న ప్రాంతంలో ఏర్పాట్లు ఎక్కడివరకు వచ్చాయో అడిగి తెలుసుకున్నారు. సీఎం చేరుకోనున్న క్రమంలో అక్కడి హెలిప్యాడ్ను పరిశీలించారు. ఆయన వెంట జేసీతో పాటు ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు.


