News January 25, 2025
జనగామలో రేపటి గణతంత్ర దినోత్సవ వేడుకల వివరాలు

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 గంటలకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొని, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కలెక్టర్ జిల్లా ప్రగతిపై సందేశం, విద్యార్థులచే సాంస్కృతిక ప్రదర్శనలు, ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానోత్సవం, స్టాల్స్ ప్రదర్శన, కార్యక్రమాలు ఉంటాయని తెలియజేశారు.
Similar News
News December 6, 2025
స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స

ప్రసవ సమయంలో స్కార్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వలన తీవ్ర రక్తస్రావం కావొచ్చు. ముఖ్యంగా ప్లాసెంటా వేరుచేసే సమయంలో ఇది జరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో గర్భాశయాన్ని తొలగించడం, రక్త మార్పిడి, ICUలో చికిత్స అవసరం కావచ్చు. గర్భాన్ని కొనసాగించాలంటే నిపుణుల పర్యవేక్షణ ఉండాలి. అవసరమైన ప్రత్యేక స్కాన్లు, పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు గర్భాన్ని తొలగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News December 6, 2025
విజయవాడ: పనులు ఆలస్యం.. గడువు దాటినా మార్పు లేదు

గన్నవరం విమానాశ్రయంలో రూ. 170 కోట్లతో 10 ఏళ్ల క్రితం ప్రారంభించిన నూతన టెర్మినల్ భవనం 30 నెలల్లో పూర్తికావాల్సి ఉండగా 68 నెలలు గడిచినా పనులు ముందుకుసాగడం లేదు. కేంద్ర మంత్రి 2 సార్లు పరిశీలించి హెచ్చరికలు చేసినా మార్పు లేక డిసెంబర్ గడువు కూడా దాటిపోయింది. ఇంకా కనీసం 6 నెలలు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. టెర్మినల్ ఆలస్యంతో బోయింగ్ సేవలు ప్రారంభం కావడం లేదు.
News December 6, 2025
గుంటూరు మీదుగా శిరిడీకి కొత్త వీక్లీ స్పెషల్ రైలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించింది. తిరుపతి-సాయినగర్ శిరిడీ మధ్య కొత్త వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఈ రైలు గుంటూరు, తెనాలి, సత్తెనపల్లి వంటి ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ఇది మంగళవారం తిరుపతిలో బయలుదేరి, బుధవారం శిరిడీ చేరుకుని, తిరుగు ప్రయాణం అవుతుంది.


