News February 6, 2025
జనగామ: ఆకర్షణీయంగా వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు

నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా పశుసంవర్థక శాఖ, ఉద్యానవన శాఖ, అలాగే వివిధ కంపెనీల విత్తనాలు, ఎరువులు, సాంకేతిక ఉత్పత్తులు తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకు స్టాళ్లు ఆకర్షణీయంగా మారాయి.
Similar News
News November 19, 2025
GHMC ఎన్నికల్లో జనసేన పోటీ!

తెలంగాణ రాజకీయాలపై జనసేన పార్టీ ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లో జనసేన పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు రాజలింగం వెల్లడించారు. కూకట్పల్లి నియోజకవర్గ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో జనసేన రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్గౌడ్ సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, కార్యకర్తల సమీకరణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
News November 19, 2025
కలెక్టర్కు మంత్రి వివేక్ సత్కారం

మంచిర్యాల జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం అభినందనీయమని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జల్ సంచయ్ జన్ భగీదారి నేషనల్ అవార్డు అందుకున్న సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ను శాలువాతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, ఇంకా జరగాల్సిన పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.
News November 19, 2025
సంగారెడ్డి: వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: కలెక్టర్

వయోవృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తుందని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధులు విజ్ఞాన భాండాగారాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి పాల్గొన్నారు.


