News February 6, 2025

జనగామ: ఆకర్షణీయంగా వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్లు

image

నిడిగొండ గ్రామంలో కిసాన్ మేళా, వ్యవసాయ ఉత్పత్తుల స్టాళ్ల ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల ప్రదర్శనలో భాగంగా పశుసంవర్థక శాఖ, ఉద్యానవన శాఖ, అలాగే వివిధ కంపెనీల విత్తనాలు, ఎరువులు, సాంకేతిక ఉత్పత్తులు తదితర స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన రైతులకు స్టాళ్లు ఆకర్షణీయంగా మారాయి.

Similar News

News February 17, 2026

త్వరలో హాస్టళ్లలోని 1,433 పోస్టుల భర్తీ: సవిత

image

AP: సంక్షేమ హాస్టళ్లలోని 1,433 కుక్, లేబర్, పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయనున్నామని మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు. ‘142 కుక్, లేబర్, 1,291 పారిశుద్ధ్య సిబ్బంది పోస్టులు భర్తీ చేస్తాం. కొత్తగా 10 MJP BC గురుకులాలను నెలకొల్పుతాం. 6 గురుకుల స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తాం. పోస్టు మెట్రిక్ స్కాలర్‌షిప్‌లకోసం ₹420CR, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ₹933 CR కేటాయించాం’ అని వివరించారు.

News February 17, 2026

VZM: రైల్వే పోలీసుల ఫోన్ నంబర్లు మారాయి..

image

విజయనగరం రైల్వే పోలీసుల (GRP) ఫోన్ నంబర్లు మారాయి. టెలికాం సంస్థతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వారికి కొత్త నంబర్ల కేటాయింపు జరిగింది. అందులో భాగంగా ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ హోదాల్లో ఉన్న వారికి మాత్రమే నంబర్లు వినియోగించుకునే అవకాశం ఉంది. అందులో భాగంగా విజయనగరం రైల్వే ఎస్‌ఐ 9247585742, పలస ఎస్‌ఐ 9247585743, ఆమదాలవలస ఎస్‌ఐ 9247585744 నంబర్లలో అందుబాటులో ఉంటారు.

News February 17, 2026

అజిత్ పవార్ మృతి.. కీలక పరిణామం

image

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ <<19106331>>మృతి కేసులో<<>> కీలక పరిణామం చోటుచేసుకుంది. విమాన ప్రమాదంపై సీబీఐ విచారణ చేయాలని ఆయన భార్య, Dy.CM సునేత్రా పవార్ డిమాండ్ చేశారు. NCP లీడర్లు, పెద్ద కుమారుడు పార్థ్‌తో ఆమె సీఎం ఫడణవీస్‌ను కలిసి ఈ మేరకు లేఖను అందజేశారు. ‘ఈ విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయిస్తామన్నారు’ అని NCP నేత సునీల్ వెల్లడించారు.