News February 17, 2025
జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలియజేశారు. మొదటి సెషన్లో 161 మంది విద్యార్థులకు గాను 153 విద్యార్థులు హాజరయ్యారు. రెండో సెషన్లో 195 మంది విద్యార్థులకు గాను 186 విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు.
Similar News
News November 11, 2025
డేవిడ్ సలయ్కి ‘బుకర్ ప్రైజ్’

కెనడియన్-హంగేరియన్ రచయిత డేవిడ్ సలయ్ను ఈ ఏడాది ‘బుకర్ ప్రైజ్’ వరించింది. సాధారణ మనిషి జీవితం ఆధారంగా ఆయన రాసిన ‘ఫ్లెష్’ నావెల్కిగానూ ఈ పురస్కారం దక్కింది. 51 ఏళ్ల డేవిడ్ ఫైనల్లో ఐదుగురు రచయితలను వెనక్కినెట్టారు. వీరిలో ఇండియన్ మహిళా రచయిత కిరణ్ దేశాయ్ కూడా ఉన్నారు. ఆమె రాసిన ‘లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ పుస్తకం బుకర్ దక్కించుకోలేకపోయింది.
News November 11, 2025
తిరుమల: ముగ్గురు పోలీస్ అధికారుల స్టేట్మెంట్ రికార్డు

పరకామణి చోరీ కేసులో సోమవారం ముగ్గురు పోలీసులను CID బృందం విచారణ చేపట్టింది. కేసులో ఉన్న మాజీ CI జగన్ మోహన్ రెడ్డి, SI లక్ష్మీపతి, విజిలెన్స్ అధికారి గిరిధర్ను విచారించారు. కేసు సెక్షన్లు ఏవీ, ఎందుకు పెట్టారు, అరెస్టు ఎందుకు చేయలేదు, రాజీ ఎలా చేశారు, లోక్ అదాలత్లో ఎవరు చెబితే పెట్టారనే ప్రశ్నలు వేసి వారి సమాధానాలను రికార్డు చేశారు.
News November 11, 2025
HNK నుంచి తిరుపతి, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు

WGL జిల్లా భక్తుల సౌకర్యార్థం ఏసీ బస్సు సేవలు ప్రారంభమవుతున్నాయని టీజీఆర్టీసీ RM డి.విజయభాను తెలిపారు. ఈ నెల 14వ తేదీ నుంచి హనుమకొండ బస్టాండ్ నుంచి ప్రతి రోజు ఉదయం 9 గంటలకు శ్రీశైలంకు, ఉదయం 8.40 గంటలకు తిరుపతికి ఏసీ రాజధాని బస్సులు నడుస్తాయని వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీశైలంకు, రాత్రి 11.10 గంటలకు తిరుపతికి చేరుకుంటాయని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.


