News February 17, 2025

జనగామ: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది గైర్హాజరు

image

జనగామ జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 17 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి తెలియజేశారు. మొదటి సెషన్‌లో 161 మంది విద్యార్థులకు గాను 153 విద్యార్థులు హాజరయ్యారు. రెండో సెషన్‌లో 195 మంది విద్యార్థులకు గాను 186 విద్యార్థులు హాజరైనట్లు తెలియజేశారు.

Similar News

News October 28, 2025

SBIలో 10 పోస్టులు… అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

SBI‌లో 10 డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MBA, PGDM, PGDBM, CFA/CA అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్ పోస్టుకు గరిష్ఠ వయసు 45ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 36ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టుకు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://sbi.bank.in/

News October 28, 2025

ఏలూరు: మొంథా తుఫాను.. మూడు మండలాలపై తీవ్ర ప్రభావం

image

కైకలూరు, నూజివీడు, ఉంగుటూరు మండలాల్లో మొంథా తుఫాను తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు 2,000 పోల్స్, 500 ట్రాన్స్‌ఫార్మర్‌లు సిద్ధంగా ఉంచామన్నారు. సోమవారం సాయంత్రానికి జిల్లాలో 25.4 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు.

News October 28, 2025

కర్నూలు ప్రమాదం.. 19 వాహనాలు తప్పించుకున్నాయ్!

image

AP: కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బైకర్ శివశంకర్ 2.45amకు డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే చనిపోగా, బైకు రోడ్డు మధ్యలో పడింది. vకావేరీ బస్సు 2.55am ప్రాంతంలో బైకును ఢీకొట్టింది. అయితే ఈ మధ్యలో 19 వాహనాలు బైకును తప్పించుకొని వెళ్లాయి. ఈ బస్సు డ్రైవర్‌కు అది కనిపించలేదా? నిర్లక్ష్యమా? అనేది తేలాల్సి ఉంది. ఆ బైకును ఒక్కరు పక్కకు జరిపినా 19ప్రాణాలు దక్కేవి.