News February 17, 2025

జనగామ: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) ధర్మకంచలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు వారి కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News November 28, 2025

సూర్యాపేట జిల్లా గ్రామ ఓటర్ల లెక్క

image

సూర్యాపేట జిల్లాలో గ్రామ ఓటర్ల లెక్క తేలింది. జిల్లా వ్యాప్తంగా 486 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కాగా గ్రామ ఓటర్లు ఉన్నట్లు 6,94,815 ఎన్నికల సంఘం ప్రకటించింది. గరిడేపల్లి మండలంలో అత్యధికంగా 46,796 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా తిరుమలగిరి మండలంలో 17,799 మంది ఓటర్లు ఉన్నారు. ఇతరులు 22 మంది ఉన్నారు. మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. ఈ తుది జాబితాలోనే జిల్లాలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

News November 28, 2025

జనగామ: ఏకగ్రీవం వైపు సీనియర్.. పోటీ వైపు జూనియర్!

image

జనగామ జిల్లాలోని ఆయా గ్రామాల్లో పలు పార్టీల నేతలు ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నారు. సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా.. ఏకగ్రీవం చేస్తే గ్రామానికి పనులు చేస్తామంటూ స్వంతంగా మేనిఫెస్టో తయారు చేసి పలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా ఏకగ్రీవానికి చోటు ఇవ్వం అన్నట్లుగా యువ రాజకీయ నాయకులు పావులు కదుపుతున్నారు. ఏదేమైనా గ్రామాన్ని అభివృద్ధి చేసే వాళ్లు కావాలని ప్రజలు అంటున్నారు.

News November 28, 2025

జనవలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్ళు రద్దు (1/2)

image

➤ జనవరి 27న (17480)తిరుపతి – పూరి ఎక్స్ ప్రెస్
➤ 28న (17479)పూరి -తిరుపతి ఎక్స్ ప్రెస్
➤ 28న (22708)తిరుపతి -విశాఖ డబల్ డెక్కర్
➤ 29న (22707)విశాఖ -తిరుపతి )డబల్ డెక్కర్
➤ 28,29న (17219)మచిలీపట్టణం -విశాఖ ఎక్స్ ప్రెస్
➤ 29,30న (17220)విశాఖ -మచిలీపట్టణం ఎక్స్ ప్రెస్
➤ 31న (22876, 22875 ) గుంటూరు -విశాఖ,విశాఖ – గుంటూరు ఉదయ్ ఎక్స్ ప్రెస్ రద్దు చేశారు