News February 17, 2025
జనగామ: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కాని విద్యార్థులకు ఇంటర్ బోర్డు మరో అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి జితేందర్ రెడ్డి తెలిపారు. ఈనెల 18 నుంచి 22 వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల(కో-ఎడ్యుకేషన్) ధర్మకంచలో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మరిన్ని వివరాలకు వారి కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించాలన్నారు.
Similar News
News April 11, 2026
ఏపీలో 6 జోన్లు.. లిస్ట్ ఇదే

AP: ఉద్యోగాల కల్పనకు సంబంధించి రాష్ట్రంలోని 4 జోన్లను క్యాబినెట్ 6 జోన్లుగా మార్చింది. రెండు మల్టీ జోన్లను మూడుగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.
Z1: SKLM, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి
Z2: అల్లూరి, తూ.గో, కాకినాడ, కోనసీమ
Z3: ప.గో, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా
Z4: గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు
Z5: తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప
Z6: నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి
News April 11, 2026
కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.
News April 11, 2026
పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

పోస్టల్ శాఖలో గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల భర్తీకి JANలో ఇచ్చిన 28,636 పోస్టుల భారీ నోటిఫికేషన్ <


