News March 5, 2025
జనగామ: ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్

భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం, జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గల ఈవీఎం గోదాంను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా నమోదు పుస్తకం, సీసీ కెమెరాల పని తీరు, మంటల నియంత్రణ పద్ధతులను పర్యవేక్షించారు. ఈవీఎం వీవీ ప్యాట్లు, బ్యాలెట్ యూనిట్లు, భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని పోలీసు సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News December 10, 2025
ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్: గద్వాల్ ఎస్పీ

గద్వాల, గట్టు, కేటి దొడ్డి, ధరూర్ మండలాల్లో జరిగే మొదటి విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి కూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సభలు సమావేశాలు, ప్రచారం లౌడ్ స్పీకర్ వినియోగం, బైక్ ర్యాలీలు నిషేధమన్నారు.
News December 10, 2025
మొగల్తూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మొగల్తూరు (M) పేరుపాలెం సౌత్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు (75) అనే వృద్ధుడు సైకిల్పై వెళ్తుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News December 10, 2025
పర్వతగిరిలో హరిత పోలింగ్ స్టేషన్..!

పర్వతగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 30/7 పోలింగ్ స్టేషన్ను హరిత పోలింగ్ స్టేషన్గా తీర్చిదిద్దారు. ఆకుల అల్లికలతో స్వాగత తోరణాలు ఏర్పాటు చేసి పోలింగ్ స్టేషన్ను పూర్తిగా ఆకుపచ్చగా తయారు చేశారు. తహశీల్దార్ వెంకటస్వామి, ఏపీఎం రాజీరు ఆధ్వర్యంలో మహిళలు పోలింగ్ స్టేషన్ వద్ద రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓట్లు వేసేలా పోలింగ్ స్టేషన్ను సిద్ధం చేశారు.


