News March 25, 2025

జనగామ: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను పరిశీలించిన కలెక్టర్

image

జనగామ పురపాలిక పరిధిలో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్‌ల క్రమబద్ధీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ ప్లాట్‌ల ఆన్‌లైన్ నిశితంగా పర్యవేక్షించి, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు పూర్తిస్థాయి రుసుమును చెల్లించాలన్నారు. 

Similar News

News December 10, 2025

సిరిసిల్ల: ఓటు చోరీకి మద్దతుగా 27వేల సంతకాల సేకరణ

image

టీపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు ఓటు చోరీ కార్యక్రమానికి మద్దతుగా జిల్లాలో 27 వేల సంతకాలను సేకరించినట్లు డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందని నిరూపిస్తూ సేకరించిన సంతకాలను గాంధీభవన్లో అప్పగించామని పేర్కొన్నారు. ఓట్ చోరీ జరిగిన విషయం రాష్ట్రపతి వరకు చేరవేసేందుకు రాహుల్ గాంధీ చేపట్టిన కార్యక్రమానికి జిల్లా ప్రజలు మద్దతు తెలిపారని ఆయన వెల్లడించారు.

News December 10, 2025

ఎన్నికల కేంద్రాల వద్ద 144 సెక్షన్: గద్వాల్ ఎస్పీ

image

గద్వాల, గట్టు, కేటి దొడ్డి, ధరూర్ మండలాల్లో జరిగే మొదటి విడత ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్(144 సెక్షన్) అమల్లో ఉంటుందన్నారు. పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమి కూడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సభలు సమావేశాలు, ప్రచారం లౌడ్ స్పీకర్ వినియోగం, బైక్ ర్యాలీలు నిషేధమన్నారు.

News December 10, 2025

మొగల్తూరులో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

వ్యాన్ ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన మొగల్తూరు (M) పేరుపాలెం సౌత్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహరావు (75) అనే వృద్ధుడు సైకిల్‌పై వెళ్తుతుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వై.నాగలక్ష్మి తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టానికి నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.