News January 31, 2025

జనగామ: కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

జనగామ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లో కంది పంట కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులతో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. కంది పంట సాగు చేసిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం మార్కుఫెడ్ ద్వారా క్వింటాకు మద్దతు ధర రూ.7,550లు కల్పించి కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు పంటను ప్రమాణాల కనుగుణంగా శుభ్రపరచి AEO వద్ద ధ్రువీకరణ, పట్టాదారు పాసుబుక్, ఆధార్, బ్యాంకు జిరాక్స్ తీసుకురావాలన్నారు.

Similar News

News November 17, 2025

రేపు భూపాలపల్లికి ఎంపీ కడియం కావ్య

image

రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ బాలకృష్ణ ఈరోజు తెలిపారు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసన సభ్యులు తదితరులు పాల్గొంటారని, కావున జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

News November 17, 2025

రేపు భూపాలపల్లికి ఎంపీ కడియం కావ్య

image

రేపు (మంగళవారం) ఉదయం 10 గంటలకు భూపాలపల్లి ఐడీఓసీ కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అధ్యక్షతన దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు డీఆర్డీఓ బాలకృష్ణ ఈరోజు తెలిపారు. జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసన సభ్యులు తదితరులు పాల్గొంటారని, కావున జిల్లా అధికారులు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.

News November 17, 2025

భూపాలపల్లి: విషాదం.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య

image

భూపాలపల్లి(D) గణపురం(M) బుద్ధారంలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కరీంనగర్(D) ఇల్లందకుంట మండలానికి చెందిన మౌనిక(23)కు రెండేళ్ల క్రితం ఇక్కడి యువకుడు ప్రశాంత్‌తో వివాహమైంది. అదనపు కట్నం కోసం భర్త, కుటుంబ సభ్యులు నిరంతరం వేధిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక 7 నెలల గర్భిణిగా ఉన్న మౌనిక ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. మౌనిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.