News March 20, 2025

జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు

image

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జనగామ కలెక్టరేట్లోని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో గురువారం ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ హాజరై మాట్లాడుతూ.. ముస్లిం ఆచార సాంప్రదాయం ఆచరిస్తూ.. సమాజం కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 15, 2025

నిర్మల్: మద్యం షాపులకు 42 దరఖాస్తులు

image

నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు బుధవారం 42 దరఖాస్తులు వచ్చాయని డీపీఈవో అబ్దుల్ రజాక్ తెలిపారు. గత పాలసీలో 701 దరఖాస్తులు వచ్చాయని, ఈ సారి ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. చివరి రోజు వరకు వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తులు దాఖలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు ఫారాలను ఉచితంగా అందజేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను ఈ నెల 18 వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

News October 15, 2025

పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

image

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్‌’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

News October 15, 2025

సూర్యాపేట: ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలి: ఎస్పీ

image

ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని ఎస్పీ నరసింహ సూచించారు. బుధవారం సూర్యాపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పోలీసు ప్రజా భరోసాలో భాగంగా అవగాహన కల్పించి మాట్లాడారు. ప్రావీణ్యం ఉన్న అంశాలపై సాధన చేయాలని, చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనదన్నారు. అనంతరం డ్రగ్స్, సైబర్ మోసాల నివారణపై అవగాహన కల్పించారు.