News February 26, 2026
జనగామ కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

జనగామ నూతన కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లా సమగ్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రతి అర్హుడికి అందేలా పకడ్బందీ చర్యలు తీసుకుంటామన్నారు. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే తన ప్రాధాన్యత అని పేర్కొన్నారు.
Similar News
News April 14, 2026
నేను రఫ్ డాడీని: రామ్ చరణ్

పిల్లలే తన ప్రాణమని, వాళ్లు లేకపోతే ఇల్లు బోసిపోయినట్లు ఉంటుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్నారు. ‘నేను రఫ్ డాడీని. పిల్లల్ని గంతులేయనివ్వడం, ఎక్కనివ్వడం, రిస్క్ తీసుకోనివ్వడం వంటివి చేస్తాను. వారితో సమయం గడిపే తండ్రిగా ఉండాలనుకుంటా. నా ప్రపంచాన్ని కాస్త చిన్నదిగా, పరిమితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని Esquire India ఇంటర్వ్యూలో చెప్పారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
News April 14, 2026
జనగామ: ఇంటర్లో టైలర్ కూతురు భవానికి 988 మార్కులు!

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ(D) చిల్పూర్(M) చిన్న పెండ్యాలకు చెందిన పేరాల భవాని అద్భుత ప్రతిభ కనబరిచింది. తండ్రి ప్రభాకర్ టైలరింగ్ చేస్తూ చదివిస్తుండగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన భవాని టీఎస్ఆర్జేసీలో కష్టపడి చదివి 1000కి 988 మార్కులు సాధించింది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యధిక మార్కులు సాధించిన భవానిని గ్రామస్థులు, పలువురు ప్రముఖులు అభినందించారు.
News April 14, 2026
33% రిజర్వేషన్: మారనున్న సమీకరణాలు

రాబోయే ఎన్నికల నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలులోకి రానుండటంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారనుంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఉమ్మడి కర్నూలు జిల్లాలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 20కి పెరిగే అవకాశం ఉండగా, రిజర్వేషన్ల ప్రకారం అందులో 5-7 స్థానాలు మహిళలకు కేటాయిస్తారు. వీటిలో మహిళలకు కేటాయించే స్థానాలపై ఆసక్తి నెలకొంది. తమ స్థానాలు మహిళలకు రిజర్వ్ అవుతాయేమోనన్న టెన్షన్ నేతల్లో మొదలైంది.


