News March 7, 2025
జనగామ: కల్లు తాగిన ఎర్రబెల్లి

జనగామ జిల్లా దేవరుప్పుల మండలం మన్పహాడ్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దావుల వెంకన్న కుమారుడు గణేశ్-శరణ్య వివాహం జరుగగా ఈరోజు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వారి ఇంటికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి వెళుతుండగా మాజీ మంత్రిని పిలిచి కల్లు తాగాలని బీఆర్ఎస్ ఉద్యమకారుడు, గౌడ సంఘం నేత కోల సోమయ్య గౌడ్ కోరగా అభిమాని కోరిక మేరకు తాటికల్లు తాగి ఆనందం వ్యక్తపరిచారు.
Similar News
News December 19, 2025
మరికల్: ఒకే పంచాయతీకి ఉపసర్పంచులుగా నాడు భర్త.. నేడు భార్య

మరికల్ మండలం గాజులయ్యతండాకు చెందిన దంపతులు అరుదైన గుర్తింపు పొందారు. 2019లో బుడ్డగానితండా నూతన పంచాయతీగా ఏర్పడగా.. భాస్కర్ నాయక్ వార్డు సభ్యుడిగా గెలిచి, తొలి ఉపసర్పంచ్గా పనిచేశారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య జమున గాజులయ్యతండా నుంచి వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవమై, అనంతరం బుడ్డగానితండా ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. దీంతో ఒకే పదవిని భార్యాభర్తలు అలంకరించడం విశేషం.
News December 19, 2025
సర్పంచ్ అభ్యర్థికి ఒక్క ఓటూ పడలేదు!

TG: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఘటన జరిగింది. సర్పంచ్ బరిలో నిలిచిన ఓ అభ్యర్థికి ఒక్క ఓటూ రాలేదు. వరంగల్(D) ఖానాపురం(M) కీర్యాతండాలో ఈ నెల 17న సర్పంచ్ ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 239 ఓట్లు పోలవగా BJP బలపరిచిన బోడ గౌతమికి కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. చివరికి నోటాకు ఒక ఓటు పోలైంది. దీంతో ఆమె తనకు తానూ ఓటు వేసుకోలేదా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడ INC అభ్యర్థి విజయ గెలిచారు.
News December 19, 2025
అది దేశ సమాఖ్య వ్యవస్థపై దాడి: హరీశ్ రావు

TG: ఉపాధి పథకానికి గాంధీ పేరు తొలగింపుపై BRS నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది దేశ సమాఖ్య వ్యవస్థపై జరిపిన ప్రత్యక్ష దాడి అని అభివర్ణించారు. గాంధీ పేరును యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక 60:40 నిధుల నిష్పత్తిని తెరపైకి తెచ్చిన కేంద్రం ఈ పథకాన్ని నీరుగార్చాలని చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రాల అధికారాలను తగ్గిస్తూ తన పెత్తనాన్ని పెంచుకోవడానికి ఈ బిల్లును ఆయుధంగా వాడుకుంటోందన్నారు.


