News September 21, 2024

జనగామ: కుటుంబ కలహాలతో తల్లీ, కూతురు ఆత్మహత్య

image

కుటుంబ కలహాలతో కూతురితో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. సిద్దిపేట రూరల్ CI శ్రీను, SI కృష్ణారెడ్డి వివరాలు.. జనగామ జిల్లా తరిగొప్పులకు చెందిన రాజేశ్వర్, శారద ఉపాధికోసం బెజ్జంకి వచ్చి కూలీ పనులు చేస్తూ జీవిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త.. తరచూ భార్యతో గొడవపడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన శారద కూతురితో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Similar News

News September 21, 2024

గీసుగొండ: కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత: టీపీసీసీ అధ్యక్షుడు

image

కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికి పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తామని నూతన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, ఇతర నేతలు నూతన అధ్యక్షుడిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్లాలని నేతలకు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

News September 21, 2024

BREAKING.. జనగామ: తల్లిని చంపిన కుమారుడు

image

జనగామ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో కుమారుడు తల్లిని చంపాడు. స్థానికుల ప్రకారం.. కుమారుడు సత్తయ్య తల్లి సముద్రాల లక్ష్మమ్మ(65)ను రోకలిబండతో కొట్టి చంపాడు. అయితే సత్తయ్యకు కొంతకాలంగా మతిస్థిమితం లేనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 21, 2024

క్యాబినెట్‌కి ధన్యవాదాలు తెలిపిన మంత్రి సీతక్క

image

ఏటూరునాగారం కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు, ములుగు మెడికల్ కాలేజీకి పోస్టులు మంజూరుకు క్యాబినెట్ సంపూర్ణ ఆమోదం తెలిపింది. ఈ మేరకు క్యాబినెట్‌కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు. ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అవడం వల్ల ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించగలుగుతామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.