News February 1, 2025

జనగామ: గుండెపోటుతో వ్యక్తి మృతి

image

జనగామ పట్టణానికి చెందిన తమ్మడి నర్సింగరావు(55) గుండెపోటుతో శుక్రవారం సాయంత్రం మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతుడి స్వస్థలం రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ కాగా.. గత కొన్నేళ్లుగా జనగామలో నివసిస్తున్నారు. నేడు సాయంత్రం జనగామలో అంత్యక్రియలు జరగనున్నాయి.

Similar News

News December 6, 2025

VKB: 3వ విడతలో 909 నామినేషన్లు

image

వికారాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఇందులో మొత్తం 157 జీపీలకు 909 మంది అభ్యర్థులు, వార్డు సభ్యుల కోసం 3,055 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వీటిల్లో పరిగి నియోజకవర్గంలోని మండలాల్లోనే 1,340 వార్డు స్థానాలు ఉన్నాయి. కాగా ఈ విడతలో మొత్తం 157 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుకలెక్టర్ తెలిపారు.

News December 6, 2025

TGపై పవన్ వ్యాఖ్యలు సరికాదు: ఉండవల్లి

image

AP: తెలంగాణపై పవన్ కళ్యాణ్ <<18394542>>దిష్టి<<>> వ్యాఖ్యలు సరికాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. డిప్యూటీ సీఎం స్థాయి నేత మాట్లాడేటప్పుడు ఆలోచించుకోవాలని హితవు పలికారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్న చంద్రబాబు తన వ్యాపారాలను ఏపీకి ఎందుకు తీసుకురావట్లేదని ప్రశ్నించారు. BJP, జనసేన, TDP పొత్తు ఎంతకాలం కొనసాగుతుందో చూడాలన్నారు. మరోవైపు అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదన్నారు.

News December 6, 2025

విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా: హరీశ్

image

TG: కాంగ్రెస్ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ‘రైతులకు యూరియా సరఫరా చేయలేని రేవంత్.. విజయోత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తున్నారు. చేసిందేమీ లేక గప్పాలు కొట్టారు. గ్లోబల్ సమ్మిట్, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న CM ముందు యూరియా సరఫరాపై దృష్టి పెట్టాలి. క్యూలైన్లలో రైతులు నరకం చూస్తున్నారు’ అని మండిపడ్డారు.