News March 31, 2025
జనగామ: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

జనగామ జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్ను ఫైనల్ చేయలేదు. కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇళ్లు ఇప్పిస్తామని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
కడెం: ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్

నిర్మల్ జిల్లాలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులు సస్పెండ్ అయ్యారు. కడెం మండలం ఉడుంపూర్ అటవీ రేంజ్ పరిధిలోగల పాత రాంపూర్ ఈస్ట్ బీట్ అధికారి మహేందర్తో పాటు డీఆర్ఓ చంద్రమౌళిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు ఎఫ్డీఓ శివకుమార్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకుగాను ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 18, 2025
SRCL: ‘ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలి’

ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రాజీవ్ నగర్ బస్తీ దవాఖాన, అంబేడ్కర్ నగర్ యూపీహెచ్సీల్లో మంగళవారం ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా ఆసుపత్రుల్లో ఓపీ రిజిస్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇమ్యూనైజేషన్ గది, ఇన్-పేషెంట్ గదులు, ఇతర గదులు, పరిసరాలను కలెక్టర్ పరిశీలించారు.


