News April 11, 2025
జనగామ జిల్లాకు చేరుకున్న ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు

రాబోయే విద్యా సంవత్సరం 2025-26కు గాను జనగామ జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు గురువారం నుంచి చేరుకుంటున్నాయని జిల్లా విద్యా శాఖ అధికారి రమేశ్ తెలిపారు. 2,78,310 పాఠ్యపుస్తకాలు అవసరం ఉంటాయని, రాష్ట్ర గోదాం నుంచి గురువారం జిల్లా కేంద్రానికి చేరాయని అన్నారు. ఈనెల చివరి వరకు అన్ని చేరుకుంటాయని, అవి రాగానే మండలాల వారీగా పంపుతామని తెలిపారు.
Similar News
News November 20, 2025
పరకామణి కేసుపై తర్జనభర్జన..?

హైకోర్టు ఆదేశాలతో తిరుమల శ్రీవారి పరకామణి కేసు విచారణను CID బృందం వేగవంతం చేసింది. పరకామణి చోరీపై మరోసారి తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని TTD బోర్డు నిర్ణయించింది. హైకోర్టు పరిశీలనలో ఉన్న కేసుపై మరోసారి కేసు ఎలా నమోదు చేయాలని పోలీసుల తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. కేసును పోలీసులకు ఇవ్వాలా? లేదా హైకోర్టుకు నివేదించాలా? లేదా CIDకే మరోసారి ఫిర్యాదు చేయాలా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
News November 20, 2025
తప్పుల సవరణకు ఈ ఒక్కరోజే ఛాన్స్!

TG: గ్రామ పంచాయతీలు, వార్డు ఓటరు జాబితాలో <<18333411>>తప్పులు<<>> ఉంటే సవరించుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. పొరపాట్ల సవరణకు ఈ ఒక్కరోజు మాత్రమే ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. 22న జిల్లా పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరిస్తారని SEC పేర్కొంది. 23న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. https://tsec.gov.in/లోకి వెళ్లి మీ పేరును చెక్ చేసుకొని తప్పులుంటే GPలో సంప్రదించాలి.
News November 20, 2025
గద్వాల్: పాఠశాల దోపిడీ, నిర్లక్ష్యంపై ఆగ్రహం

జవాబు చెప్పలేదని మండే ఇసుకలో మోకాళ్లపై నడిపించిన ప్రైవేట్ స్కూల్ తీరు మొదటినుంచి అంతేనని ఉదయ్ తండ్రి రంగన్న అన్నారు. వడ్డేపల్లి (M) జూలకల్లులోని ప్రైవేట్ పాఠశాల గతంలో కూడా ఉదయ్ను ఇలాగే కొడితే తీరు మార్చుకోవాలని కరస్పాండెంట్కు చెప్పినా మారలేదన్నారు. <<18334569>>సుమారు గంటపాటు మోకాళ్లపై నడిపించడం దారుణమని<<>> సదరు పాఠశాలపై చర్యలు తీసుకోవాలన్నారు.


