News March 10, 2025

జనగామ జిల్లాకు రూ.200 కోట్లు

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గానికి రూ.200 కోట్లు మంజూరయ్యాయి. దీంతో జిల్లాలో విద్యాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 5, 2025

భవనం రగడ.. ఎమ్మెల్యే VS మాజీ ఎమ్మెల్యే

image

మణుగూరు ఓ భవనం పేటెంట్ హక్కు తమదంటే తమదంటూ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య రాజుకున్న వివాదం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీని పెంచి పోషించిన కాంగ్రెస్‌నే మాజీ MLA రేగా కాంతారావు ముంచారంటూ MLA పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. జిల్లాలో రూ.కోట్ల నిధులు పక్కదారి పట్టాయని తాను అడగడంతో, ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే MLA, ఇద్దరు మంత్రులు వివాదాన్ని తెరమీదకు తెచ్చారని రేగా ఎదురుదాడికి దిగారు.

News November 5, 2025

రేపే బిహార్ తొలిదశ పోలింగ్

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.

News November 5, 2025

చర్మ పీహెచ్‌ను కాపాడుతున్నారా?

image

ప్రస్తుత వాతావరణ మార్పుల వల్ల చర్మం దెబ్బతింటోంది. అందుకే దాని పీహెచ్‌ సరిగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. చర్మాన్ని రక్షిస్తూ ఎసిడిక్‌ ఫిల్మ్‌ ఉంటుంది. దాని pH 4.5- 5.5 మధ్య ఉండేలా చూసుకోవాలి. లేదంటే మొటిమలు, దద్దుర్లు, పొడిబారడం, అతిగా నూనెలు విడుదలవ్వడం, ఎగ్జిమా వంటి సమస్యలు వస్తాయి. pH బ్యాలెన్స్‌డ్‌ ప్రొడక్ట్స్, సన్‌స్క్రీన్‌ వాడాలి. స్క్రబ్బింగ్ ఎక్కువగా చేయకూడదని సూచిస్తున్నారు.