News April 10, 2025

జనగామ జిల్లాలో నలుగురు తహసీల్దార్ల బదిలీ

image

జనగామ జిల్లాలోని నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకుర్తి తహసీల్దార్ పి.శ్రీనివాస్‌ను జనగామ ఆర్డీవో కార్యాలయానికి, దేవరుప్పులకు జనగామ ఆర్డీవో కార్యాలయంలోని డీఏవో ఆండాళ్‌ను, దేవరుప్పుల తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని తరిగొప్పులకు, తరిగొప్పుల తహసీల్దార్ నాగేశ్వర్ చారిని పాలకుర్తి తహసీల్దార్‌గా బదిలీ చేశారు.

Similar News

News December 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నూతన డీసీసీ అధ్యక్షుడు ప్రమాణస్వీకారం
∆} రెండో రోజు కొనసాగుతున్న రెండో విడత నామినేషన్లు
∆} మధిర మృత్యుంజయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం జిల్లాకు వర్ష సూచన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం.

News December 1, 2025

ఆ డాక్టర్లకు 50శాతం ఇన్సెంటివ్!

image

TG: గిరిజన జిల్లాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రొఫెసర్లు, టీచింగ్ ఫ్యాకల్టీకి బేసిక్ పేలో 50% అదనపు ఇన్సెంటివ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రైబల్ ఏరియాకు వెళ్లేందుకు డాక్టర్లు ఇష్టపడట్లేదు. ఫలితంగా కాలేజీల్లో ఫ్యాకల్టీ కొరత ఏర్పడి గుర్తింపు కోల్పోయే ప్రమాదముంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి, ఆసిఫాబాద్, MLG, MHBD, భూపాలపల్లి కాలేజీలు గిరిజన ప్రాంతాల పరిధిలోకి వస్తాయి.

News December 1, 2025

కృష్ణా: నవోదయలో 21 మంది విద్యార్థులు సస్పెండ్.. కారణమిదే.!

image

వేలేరు నవోదయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థులు అర్ధరాత్రి సాహసం చేసి సస్పెండయ్యారు. రాత్రి 10 గంటల తర్వాత హాస్టల్‌లోని ఎగ్జిట్ ఫ్యాన్ బెజ్జం తీసి, చిన్న రంధ్రం గుండా బయటపడ్డారు. హనుమాన్ జంక్షన్-నూజివీడు రోడ్డుకు వెళ్లి బిర్యానీ తెచ్చుకున్న ఈ విద్యార్థులను గుర్తించిన ప్రిన్సిపల్ తీవ్రంగా స్పందించి, వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేసి ఇళ్లకు పంపినట్లు తెలిపారు.