News February 24, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్
> అధికారం శాశ్వతం కాదు: ఎర్రబెల్లి
> రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలి: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
> జిల్లాలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు
> పాలకుర్తి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కలెక్టర్‌కు ఆహ్వానం
> చెరువులను నింపి నీళ్లు అందించాలి: ఎమ్మెల్యే పల్లా
> జిల్లాలోని పలు ఆలయాలలో శివరాత్రి జాతర ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Similar News

News March 19, 2025

క్రెడిట్ కార్డులను క్లోజ్ చేస్తున్నారా?

image

కొందరు ఖర్చులు పెరిగిపోతున్నాయంటూ క్రెడిట్ కార్డులను క్లోజ్ చేయాలని భావిస్తుంటారు. కానీ వాటిని తీసేస్తే క్రెడిట్ హిస్టరీ దెబ్బతింటుంది. క్రెడిట్ స్కోర్ పడిపోయే ఛాన్స్ ఉంది. ఇవి అత్యవసర పరిస్థితుల్లో బ్యాకప్‌గా ఆదుకుంటాయి. ఈ కార్డులను యాక్టివ్‌గా ఉంచుకోవడమే బెటర్. అతిగా ఖర్చు చేసేవారు మాత్రం క్లోజ్ చేసుకుంటేనే మంచిది. మీరు ఉపయోగించకపోయినా మేనేజ్‌మెంట్ ఛార్జీలు ఎక్కువైతే కార్డు తీసేయడం ఉత్తమం.

News March 19, 2025

ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించండి: మంత్రి నాదెండ్ల

image

AP: దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. ధాన్యాన్ని ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. అన్నదాతలకు అందుబాటులో 5 లక్షల గన్నీ సంచులున్నాయని తెలిపారు. ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

News March 19, 2025

అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేయండి: సుప్రీం

image

దేశంలోని చాలా రాష్ట్రాల్లో రేషన్ కార్డులు దుర్వినియోగం అవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పేదలు అనుభవించాల్సిన ఫలాలు ధనికులు అనుభవిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. వెంటనే అనర్హుల రేషన్ కార్డులను రద్దు చేయాలని జస్టిస్ సూర్యకాంత్, ఎన్.కోటీశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. దేశంలో దాదాపు 80 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారందరికీ ఆహార భద్రత ఎంతో అవసరమని పేర్కొంది.

error: Content is protected !!