News March 30, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> బచ్చన్నపేట: జీతాలు రాక ఇబ్బంది పడుతున్న జీపీ కార్మికులు > పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే > జిల్లా వ్యాప్తంగా సజావుగా కొనసాగిన 10వ తరగతి పరీక్షలు > పాలకుర్తిలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు > జయంతి ఉత్సవాలపై కలెక్టరేట్లో సమీక్ష సమావేశం > జిల్లా వాసులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ > ఇఫ్తార్ విందులో పాల్గొన్న యశస్విని రెడ్డి, కడియం.
Similar News
News December 4, 2025
WGL: పెరిగిన వండర్ హట్, తగ్గిన తేజా మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గురువారం ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. వండర్ హాట్(WH) మిర్చి క్వింటాకు బుధవారం రూ.19 వేలు ధర రాగా, ఈరోజు రూ.19,300 అయింది. 341 రకం మిర్చికి నిన్న రూ.16,500 ధర రాగా, నేడు కూడా అదే దర వచ్చింది. అలాగే తేజ మిర్చి బుధవారం రూ.14,200 పలకగా, ఈరోజు కూడా అదే ధర వచ్చింది. కొత్త తేజ మిర్చి నిన్న రూ.14,800 ధర వస్తే నేడు రూ.14,200కి పడిపోయింది.
News December 4, 2025
ASF: ఊపందుకున్న సోషల్ మీడియా ప్రచారం

ASF జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి సోషల్ మీడియాలో ఊపందుకుంది. అభ్యర్థులు అభివృద్ధి హామీలతో పోస్టులు షేర్ చేస్తూ, తమ మేనిఫెస్టోలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. సమస్యల పరిష్కారం వంటి హామీలతో గ్రామాల్లో చర్చలు రగులుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వీడియోలు, పోస్టర్లను ఫేస్ బుక్, వాట్స్ అప్, ఇంస్టాగ్రామ్లో వైరల్ అవుతున్నాయి. ఎవరి వర్గానికి వారు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
News December 4, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో ఏసీబీ దాడులు

రంగారెడ్డి కలెక్టరేట్ అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే, ల్యాండ్స్ రికార్డు ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఏడీ సర్వేయర్ శ్రీనివాస్కు చెందిన గచ్చిబౌలిలోని మైత్రి హోమ్స్లోని ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో 3 బృందాలుగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 6 చోట్ల సోదాలు జరుగుతున్నాయి.


