News April 11, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
> పాలకుర్తి తహసీల్దారుగా బాధ్యతలు స్వీకరించిన నాగేశ్వర చారి
> పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని పాలకుర్తిలో ధర్నా నిర్వహించిన సీపీఎం నేతలు
> లింగాల గణపురం: పిడుగుపాటుకు వ్యక్తి మృతి
> గాలివాన బీభత్సం జిల్లాలో పలుచోట్ల రోడ్లపై విరిగిపడ్డ చెట్లు
> జనగామ: వ్యక్తి బతికుండగానే చనిపోయినట్లు సృష్టించి అక్రమంగా భూమి పట్టా

Similar News

News April 16, 2026

టీబీ రహిత జిల్లాయే లక్ష్యం: కలెక్టర్

image

వచ్చే సంవత్సరం టీబీ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని కలెక్టర్ చాహత్ బాజ్ పాయి పేర్కొన్నారు. గురువారం ఎల్కతుర్తిలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆశా, ఏఎన్ఎం సిబ్బంది కృషితో జిల్లాలో టీబీ కేసులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. ఎల్కతుర్తిని టీబీ రహిత మండలంగా మార్చాలన్నారు. సర్పంచ్ లావణ్య, డీఎంహెచ్వో అప్పయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

News April 16, 2026

యుద్ధం ముగించడానికి ట్రంప్ ప్లాన్ ఇదేనా?

image

ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించాలంటే ఆ దేశంపై ఆర్థికంగా ఒత్తిడి పెంచడమే ఏకైక మార్గమని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. తాజాగా వైట్ హౌస్‌లో నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్‌తో జరిగిన ప్రైవేట్ డిన్నర్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే హార్ముజ్‌ను దిగ్బంధించినట్లు టాక్. అదే నిజమైతే భారత్ సహా పలు దేశాలు మరికొన్నాళ్లు చమురు సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.

News April 16, 2026

పరిశ్రమలను అడ్డుకోవడం సైకోయిజమే: లోకేశ్

image

దేశ రక్షణకు అధునాతన బూట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి అడ్డుకుంటాం అనడం ముమ్మాటికి సైకోయిజమే అని మంత్రి లోకేశ్ X వేదికగా జగన్‌పై ఫైర్ అయ్యారు. తల్లిని తరిమేశారు, చెల్లిని గెంటేశారు, దైవం అంటే భక్తి లేదు, దైవం అంటే ద్వేషం. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు. అమరావతిని మార్చేస్తాం, కట్టినవన్నీ కూల్చేస్తాం కంపెనీలను వెళ్లగొడతాం ఏమిటి దుర్మార్గపు పనులు అని ప్రశ్నించారు.