News February 26, 2025
జనగామ జిల్లాలో పండుగపూట విషాదం

జనగామ జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. స్థానికుల వివరాలు.. జనగామ మండలం గానుగుపహాడ్ గ్రామంలో కుటుంబ కలహాలతో బుధవారం రెండేళ్ల బిడ్డతో సహా తల్లి బావిలో దూకింది. ఇద్దరిని బావి నుంచి బయటికి తీశారు. అప్పటికే రెండేళ్ల పాప మృతిచెందగా.. కొన ఊపిరితో ఉన్న తల్లి గౌరీ ప్రియను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 16, 2025
ఎన్నికలు ముగిసే వరకు BNS-163 చట్టం అమలు: CP

3వ విడత GPఎన్నికలు ముగిసే వరకు BNS-163 వ చట్టం అమలులో ఉంటుందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు. ఈనెల 17న సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి, ఓదెల మండలాల పరిధిలో చట్టం వర్తిస్తుందన్నారు. సభలు, ప్రదర్శనలకు అనుమతి లేదన్నారు. ఎన్నికల సందర్భంగా పటిష్ఠమైన పోలీస్ బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును నియోగించుకోవాలన్నారు.
News December 16, 2025
మోదీతో భేటీ అంశాలు లీక్.. కిషన్ రెడ్డి ఆగ్రహం

ప్రధాని మోదీతో తెలంగాణ BJP MPల సమావేశానికి <<18530988>>సంబంధించిన లీకులపై<<>> కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘PMతో భేటీ విషయాలను లీక్ చేసిన వ్యక్తులు మెంటల్ వాళ్లు. మీటింగ్ విషయాలు బయట చెప్పొద్దని PM చెప్పారు. అయినా వాటిని లీక్ చేశారు. వారెవరో చెప్తే చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రధాని సూచించారు’ అని మీడియాతో చిట్చాట్లో పేర్కొన్నారు.
News December 16, 2025
ఎగ్జామ్ ఫీజు చెల్లించని ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

AP: వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లించని వారికి బోర్డు మరో అవకాశం కల్పించింది. ఫస్ట్, సెకండియర్ చదివే జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు తత్కాల్ స్కీమ్ ప్రవేశపెట్టింది. రూ.5వేల ఫైన్తో ఈ నెల 22 నుంచి JAN 5 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. కాగా షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపునకు గత నెలలోనే గడువు ముగిసింది.


