News March 1, 2025
జనగామ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

జనగామ జిల్లాలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే ఓరుగల్లు వాసులు భయపడుతున్నారు. ఈరోజు వరంగల్ నగరంలో 33 నుంచి 35 °C ఉష్ణోగ్రతలు ఉంటాయని, రేపు 33 నుంచి 36 °C ఉష్ణోగ్రతలతో మేఘావృతమై ఉండనున్నట్లు వాతావరణ సూచనలు చెబుతున్నాయి. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.
Similar News
News September 17, 2025
వీరుల త్యాగానికి సాక్షిగా పాలకుర్తి!

తెలంగాణ ప్రజాస్వామ్య పోరాట కేంద్రంగా పాలకుర్తి పేరొందింది. చాకలి ఐలమ్మ, చౌదవరపు విశ్వనాధం వంటి వీరులు దొరల పాలన, నిజాం సవరణకు వ్యతిరేకంగా పోరాడి ఈ ప్రాంతానికి చరిత్రాత్మక ఘట్టాలు అందించారు. గూడూరు గ్రామం 20 మంది స్వాతంత్ర్య సమరయోధులను అందించింది. వీరి త్యాగాలు, సమర్పణలు పాలకుర్తిని ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిపాయి.
News September 17, 2025
తెలంగాణ చరిత్రను BJP వ్యతిరేకిస్తోంది: కవిత

తెలంగాణ జాగృతి కార్యాలయంలో SEP 17 తెలంగాణ విలీన దినోత్సవమేనని కవిత అన్నారు. తెలంగాణ చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని, మతవిద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని కవిత అన్నారు. మోదీపై ప్రేమ లేకపోతే ఆ పార్టీ దుష్ప్రచారం ఆపాలని.. కేంద్రానికి సీఎం రేవంత్ లేఖ రాయాలన్నారు.
News September 17, 2025
గద్వాల: నిధుల లేమితో సతమతమవుతున్న గ్రామ కార్యదర్శులు

గద్వాల జిల్లాలోని 255 గ్రామ పంచాయతీల్లో నిధుల లేమి కారణంగా అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన తర్వాత నిధులు విడుదల కాకపోవడంతో, పంచాయతీల నిర్వహణ భారమంతా కార్యదర్శులపై పడుతోంది. ఆర్థిక భారం గుదిబండగా మారడంతో కార్యదర్శులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోయాయని వారు తెలిపారు.